TSPSC Paper Leak: ప్రవీణ్, రాజశేఖర్ పెన్డ్రైవ్లకు పాస్వర్డ్

X
By - Subba Reddy |22 March 2023 10:15 AM IST
గ్రూప్1 పరీక్ష రాసిన 8మంది టీఎస్పీఎస్సీ ఉద్యోగులు
టీఎస్పీఎస్సీ పేపర్లీక్ కేసులో సిట్ విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో నిందితులను ఐదోరోజు విచారిస్తుంది. ఈ రోజు హిమాయత్నగర్ సిట్ కార్యాలయంలో పోలీసులు విచారించనున్నారు. గ్రూప్1 ప్రిలిమ్స్ పరీక్ష రాసిన వారిలో టీఎస్పీఎస్సీ ఉద్యోగులు కొందరు ఉన్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. అయితే కమిషన్ విధులు నిర్వహిస్తున్న ఎనిమిది మంది గ్రూప్1 పరీక్ష రాసినట్లు నిర్ధారించింది సిట్. పరీక్ష రాసిన ఎనిమిది మందికి నోటీసులు ఇచ్చి విచారించనున్నది. ఈ నేపథ్యంలో ప్రవీణ్, రాజశేఖర్ ఇళ్లలో సిట్ బృదం పెన్డ్రైవ్లు స్వాధీనం చేసుకుంది. అయితే ఈ పెన్డ్రైవ్లకు కూడా వీరు పాస్వర్డ్ పెట్టుకున్నారు. కాన్ఫిడెన్షియల్ సెక్షన్ ఆఫీసర్ శంకరలక్ష్మిని కూడా సిట్ విచారించింది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com