TSPSC Paper Leak: విదేశాల నుంచి వచ్చి గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ రాశారు

TSPSC Paper Leak: విదేశాల నుంచి వచ్చి గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ రాశారు
ప్రవీణ్‌కు తెలియకుండా రేణుక ఏఈ పేపర్‌ను మరికొంత మందికి అమ్మినట్లు నిర్ధారన

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కేసులో నిందితుల విచారణ నాలుగో రోజుకు చేరుకుంది. ఈ రోజు హిమాయత్‌ నగర్‌లోని సిట్‌ కార్యాలయంలో విచారణ జరగనున్నది. గ్రూప్‌1 ప్రిలిమ్స్‌ పేపర్‌ను ఎవరికి ఇచ్చారనే కోణంలో ప్రశ్నలు సంధించనున్నారు సిట్ అధికారులు. కొందరు విదేశాల నుంచి వచ్చి గ్రూప్‌1 పరీక్ష రాశారని సిట్‌ అధికారులు గుర్తించారు. ఈ పరీక్షలో 100కు పైగా మార్కులు వచ్చిన వారి వివరాలను సిట్‌ సేకరించింది. ప్రవీణ్‌కు తెలియకుండా రేణుక ఏఈ పేపర్‌ను మరికొంత మందికి అమ్మినట్లు అధికారులు నిర్ధారించారు. టీఎస్‌పీఎస్సీ పేపర్‌ తీసుకున్నవారిని గుర్తించి వారిపై కేసులు నమోదు చేయనున్నారు. అటు నిందితుడు రాజశేఖర్‌ రెడ్డి స్వగ్రామం జగిత్యాల జిల్లా మల్యాలకు సిట్‌ అధికారులు వెళ్లనున్నారు.

Tags

Next Story