TSPSC Paper Leak: 100 మార్కులు దాటిన వారిని విచారిస్తున్న సిట్‌

TSPSC Paper Leak: 100 మార్కులు దాటిన వారిని విచారిస్తున్న సిట్‌
సిట్‌ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థి నుంచి 15 అంశాలు సేకరణ

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీక్‌ కుసులో సిట్‌ దర్యాప్తు ముమ్మరం చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షలో 100 మార్కులకు పైగా వచ్చిన వారి లిస్ట్‌ తయారు చేశారు సిట్‌ అధికారులు. టీఎస్‌పీఎస్సీ బోర్ద్‌నుంచి అభ్యర్థుల సమాచారం తీసుకున్నారు. గ్రూప్స్‌ అర్హత సాధించిన వారికి ఫోన్‌ ద్వారా సమాచారం అందించారు. సిట్‌ కార్యాలయానికి వచ్చిన అభ్యర్థి నుంచి 15 అంశాలు సేకరించారు. ఎంతవరకు చదివారు ప్రస్థుతం ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారనే అంశాలు రికార్డ్‌ చేశారు. ఇప్పటి వరకు ఎన్ని పోటీ పరీక్షలు రాశారు వాటిల్లో ఎన్ని మార్కులు వచ్చాయన్న దానిపై సిట్‌ అధికారులు వివరాలు సేకరించారు. గతంలో టీఎస్‌పీఎస్సీ పరీక్షలు రాసి ఉంటే వాటి సమాచారం కూడా తీసుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story