TSRTC: నేటి నుంచే అమల్లోకి ఆర్టీసీ ఛార్జీల పెంపు

TSRTC: నేటి నుంచే అమల్లోకి ఆర్టీసీ ఛార్జీల పెంపు
X
రేవంత్ నిర్ణయంపై భగ్గుమన్న ప్రతిపక్షాలు... బడుగు జీవులు ఎలా బతకాలంటూ ప్రశ్న.. హైదరాబాదీలపై కక్ష సాధింపులన్న కేటీఆర్

భా­గ్య నగ­ర­వా­సు­ల­పై మరో పి­డు­గు పడ­నుం­ది. హై­ద­రా­బా­ద్‌ పరి­ధి­లో నడి­చే అన్ని రకాల సిటీ బస్సు­ల్లో అద­న­పు ఛా­ర్జీ­లు నేటి నుం­చి అమ­ల్లో­కి రా­ను­న్నా­యి. కనీస చా­ర్జీ­పై 50 శాతం టి­కె­ట్‌ ధరలు పెం­చు­తూ ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. ఈ మే­ర­కు తె­లం­గాణ ఆర్టీ­సీ ప్ర­క­టిం­చిం­ది. సిటీ ఆర్డి­న­రీ, మె­ట్రో ఎక్స్‌­ప్రె­స్, ఎల­క్ట్రి­క్‌ బస్సు­లు ఆర్డి­న­రీ, ఎక్స్‌­ప్రె­స్‌ అన్ని బస్సు­ల్లో మొ­ద­టి మూడు స్టే­జీ­ల­కు రూ.5, నా­లు­గో స్టే­జీ నుం­చి చి­వ­రి దాకా రూ.10 అద­నం­గా ఛా­ర్జీ­లు పె­ర­గ­ను­న్నా­యి. మె­ట్రో డీ­ల­క్స్, ఎల­క్ట్రి­క్‌-మె­ట్రో ఏసీ సర్వీ­సు­ల్లో అయి­తే మొ­ద­టి స్టే­జీ­కి రూ.5, రెం­డో స్టే­జీ నుం­చి చి­వ­రి­దా­కా రూ.10 అద­నం­గా ఛా­ర్జీ­ని వసూ­లు చే­య­నుం­ది. పె­రి­గిన బస్సు ఛా­ర్జీ­లు నేటి నుం­చి అమ­ల్లో­కి వస్తా­య­ని వె­ల్ల­డిం­చిం­ది. ప్ర­స్తు­తం సిటీ బస్సు మొ­ద­టి స్టే­జ్‌ వరకు చా­ర్జీ రూ. 10గా ఉంటే ఇప్పు­డు దా­ని­పై మరో రూ. 5 పెం­చ­డం­తో అది రూ. 15 చే­రిం­ది. నా­లు­గో స్టే­జీ నుం­చి అద­నం­గా రూ. 10 వసూ­లు చే­య­నుం­ది. అంటే రూ.20 నుం­చి రూ.30 పె­ర­గ­నుం­ది. మహా­ల­క్ష్మి ఉచిత ప్ర­యా­ణం వచ్చాక రో­జు­కు 26 లక్షల మంది ప్ర­యా­ణి­స్తు­న్న­ట్లు అం­చ­నా. గతం­లో 11 లక్షల వరకు ప్ర­యా­ణిం­చే­వా­రు. ఇప్ప­టి­కే వి­ద్యా­ర్థుల బస్‌ పా­స్‌­లు, టీ-24 టి­కె­ట్‌ చా­ర్జీ­లు పెం­చిన ఆర్టీ­సీ.. ఇప్పు­డు ప్ర­యా­ణి­కు­ల­పై భారం మో­ప­డా­ని­కి సి­ద్ధ­మైం­ది.

ఓడించారనే కక్షతోనే: కేటీఆర్

హై­ద­రా­బా­ద్, సి­కిం­ద్రా­బా­ద్ జంట నగ­రా­ల్లో సిటీ బస్సు కనీస ఛా­ర్జీ­ని ఒకటి కాదు, రెం­డు కాదు.. ఏకం­గా రూ.10 పెం­చా­ల­ని తె­లం­గాణ ప్ర­భు­త్వం తీ­సు­కు­న్న ని­ర్ణ­యా­న్ని బీ­ఆ­ర్‌­ఎ­స్‌ వర్కిం­గ్‌ ప్రె­సి­డెం­ట్‌, రా­ష్ట్ర మాజీ మం­త్రి కే­టీ­ఆ­ర్‌ తీ­వ్రం­గా వ్య­తి­రే­కిం­చా­రు. పం­డుగ సమ­యం­లో తీ­సు­కు­న్న దు­ర్మా­ర్గ­మైన ని­ర్ణ­యం­గా అభి­వ­ర్ణిం­చా­రు. పేద, మధ్య­త­ర­గ­తి ప్ర­యా­ణి­కుల జే­బు­ల­ను కొ­ల్ల­గొ­ట్టేం­దు­కు తె­లం­గాణ సీఎం రే­వం­త్ రె­డ్డి పన్నిన కు­ట్ర అని కే­టీ­ఆ­ర్ వి­మ­ర్శిం­చా­రు. పె­రి­గిన ని­త్యా­వ­సర వస్తు­వుల ధర­ల­తో తె­లం­గాణ ప్ర­జ­లు అల్లా­డు­తు­న్న సమ­యం­లో బస్సు ఛా­ర్జీల పెం­పు వారి నె­త్తిన పి­డు­గు­లాం­టి­ద­ని కే­టీ­ఆ­ర్‌ అన్నా­రు. ప్ర­తి ని­త్య ప్ర­యా­ణి­కు­డి­పై నె­ల­కు కనీ­సం రూ.500 అద­న­పు భారం పడు­తుం­ద­ని.. బడు­గు­జీ­వు­లు, ది­న­స­రి కూ­లీ­లు ఆర్టీ­సీ ఛా­ర్జీల పెం­పు­తో ఎలా బత­కా­ల­ని రే­వం­త్ రె­డ్డి­ని సూ­టి­గా ప్ర­శ్నిం­చా­రు.

Tags

Next Story