కేంద్ర హోంమంత్రి అమిత్షా తెలంగాణ పర్యటన ఖరారు..!

X
By - /TV5 Digital Team |7 Sept 2021 5:45 PM IST
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 17న ఆయన రాష్ట్రానికి రానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన ఖరారైంది. ఈనెల 17న ఆయన రాష్ట్రానికి రానున్నారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ ముందునుంచి డిమాండ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో 17న విమోచన దినోత్సవం సందర్భంగా నిర్మల్లో భారీ బహిరంగ సభకు రాష్ట్ర బీజేపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. నిర్మల్ వెయ్యి ఊడలమర్రి వద్ద బహిరంగ సభలో అమిత్ షా పాల్గొననున్నారు. అమిత్షా పర్యటన రోజు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com