Telangana: నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ ఎవరిది?

Telangana: నాగార్జునసాగర్ డ్యాం నిర్వహణ ఎవరిది?
మూతపడిన డ్యామ్ కంట్రోల్ రూమ్.. తెలంగాణ, ఏపీల మధ్య తేలని పంచాయితీ

తెలంగాణ శాసనసభ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో నాగార్జున సాగర్‌ ప్రాజెక్ట్‌ నిర్వహణ విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. బోర్డ్‌కు ఇండెంట్‌ ఇస్తున్నప్పటికీ.. తెలంగాణను పదేపదే అడగాల్సి వస్తోందని 13 వ గేటు నుంచి తమ వైపు ఉన్న గేట్లను తామే ఆపరేట్‌ చేసుకుంటామని ఏపీ ప్రకటించింది. ఇదే విషయాన్ని కృష్ణ బోర్డుకు రాసిన లేఖలో కూడా ప్రస్తావించారు. ప్రస్తుతం 13వ క్రెస్ట్‌ నుంచి ఏపీ పరిధిలో మిగతా భాగమంతా తెలంగాణ పరిధిలో ఉన్నాయి. ఇదిలా ఉండగా.......... తమ పరిధిలో ఉన్న ప్రాజెక్టును ఏపీ బలవంతంగా ఆక్రమించిందని..... తెలంగాణ కేంద్రానికి ఫిర్యాదు చేసింది. ఎన్నికల సమయంలో తీవ్ర ఉద్రిక్తలు తలెత్తిన సమయంలో.. కేంద్ర బలగాల రంగప్రవేశం వల్ల కాస్త ప్రశాంత వాతావరణం నెలకొంది. ఈ విషయంలో కేంద్ర హోం శాఖ, జలవనరుల శాఖలు రెండు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపి......, కృష్ణా బోర్డుకు చెందిన ఇద్దరు అధికారులు క్షేత్ర స్థాయి పరీక్షలను అధ్యయనం చేశారు.

నాగార్జునసాగర్ ప్రాజెక్టు CRPF దళాల ఆధీనంలో ఉన్నప్పటికీ… 13వ గేటు నుంచి ఏపీ వైపు ఉన్న ప్రాజెక్టు వద్దకు ఎన్నెస్పీ ఉద్యోగులను ఏపీ అనుమతించడం లేదు. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో 26వ గేటు తర్వాత కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సాగర్ జలాశయానికి సంబంధించిన నీటి రాకపోకలను, కుడి, ఎడమ కాల్వకు నీటి విడుదల వివరాలను ప్రతిరోజు నమోదు చేస్తారు. డీఈ స్థాయి అధికారి, ఏఈ, ఇతర సిబ్బంది 24 గంటలు విధినిర్వహణలో ఉండి నీటి పరిస్థితులను రికార్డు చేసి ఉన్నతాధికారులకు నివేదిస్తారు. అయితే ప్రస్తుతం కంట్రోల్ రూమ్ ఏపీ ఆధీనంలో ఉండడంతో ఎటువంటి కార్యకలాపాలు లేకుండా నెల రోజులుగా మూతపడింది. అప్పటి నుంచి డ్యాం అధికారులు జలాశయ నీటి వివరాలను రికార్డు చేయడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఎన్‌ఎస్పీ సిబ్బంది డ్యాం ఎడమవైపు ఉన్న లిఫ్టు గదిలో ఉంటూ నీటి వివరాలను నమోదు చేస్తున్నారు.

అయితే ఏపీ పునర్వ్యవస్థీకణ చట్టం ప్రకారం సాగర్‌ నిర్వహణ తెలంగాణే చూస్తుందని, కాబట్టి వెంటనే ప్రాజెక్టును తమకు అప్పగించాలని తెలంగాణ కేంద్రానికి వరుస లేఖలు రాసింది. కేంద్ర హోంశాఖ సూచించిన విధంగా 2023 నవంబర్‌ 28కి ముందు ఉన్న పరిస్థితిని కొనసాగేలా చూడాలని కోరుతోంది. తాజాగా ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు ఇరిగేషన్ డిపార్ట్మెంట్‌కు లేఖ రాసినట్లు సమాచారం. ఏపీ అధీనంలో ఉన్న, 13వ గేటు వరకే పనులు చేస్తున్నామని, డ్యాం మొత్తం అప్పగిస్తే తప్ప పూర్తి చేయలేమని ఆ లేఖలో రాసినట్లు విశ్వసనీయం సమాచారం. అదే లేఖలో రోజువారీ ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లోతో పాటు విద్యుదుత్పత్తికి సంబంధించి వివరాలు నమోదు చేయలేకపోతున్నామని పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. రెండువైపులా ఉన్న కాలువల లీకేజీ నీటి విడుదల విషయాలు నమోదు చేయాల్సి ఉండగా ఏపీ వైపునున్న సమాచార సేకరణ లభ్యమవడం లేదని ఆ లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ప్రాజెక్ట్ విషయంలో నెలకొన్న సందిగ్ధత తీరిపోయేలా కేంద్రం చర్యలు ఉంటాయని ప్రజలు ఆశిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story