మోదీ పాలనలో అవినీతికి తావు లేదు: కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్

అవినీతికి తావు లేకుండా మోదీ పాలన కొనసాగిస్తున్నారని కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ అన్నారు. మోదీ పాలన తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా హైదరాబాద్ మాదాపూర్లోని దసపల్లా హోటల్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్తో కలిసి 9ఏళ్ల పాలనపై ప్రత్యేక పుస్తాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేక గీతాన్ని విడుదల చేసిన కేంద్ర మంత్రి.. కరోనా వ్యాక్సిన్ దేశ ప్రజలకు ఉచితంగా అందిచామని గుర్తు చేశారు. మోదీ పాలనలో దేశంలో అభివృద్ధిలో దూసుకెళ్తుందన్నారు.
మోదీ పాలనలో పేదలకు సంక్షేమం అందుతుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. దేశ వ్యాప్తంగా మోదీ చేస్తున్న అభివృద్ధికి ప్రజలు ఫిదా అయిపోతున్నారని చెప్పారు. టాయిలెట్ల నిర్మాణం, రేషన్ బియ్యం పంపిణీ, పేదలకు ఇండ్ల నిర్మాణం కార్యక్రమాలు ఆర్శంగా నిలుస్తున్నాయన్నారు. మహాజన్ సంపర్క్ అభియాన్ పేరుతో ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com