Uttam Kumar Reddy: పీకే ఫ్యాక్టర్‌ గురించి నాకు తెలియదు- ఉత్తమ్ కుమార్ రెడ్డి

Uttam Kumar Reddy: పీకే ఫ్యాక్టర్‌ గురించి నాకు తెలియదు- ఉత్తమ్ కుమార్ రెడ్డి
Uttam Kumar Reddy: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్‌లో చేరుతారన్న అంశంపై ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు.

Uttam Kumar Reddy: రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతారన్న అంశంపై పీసీసీ మాజీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. పీకే ఫ్యాక్టర్ గురించి తనకు తెలియదని.. మీడియా ద్వారానే వింటున్న అన్నారు. పీకే చేరికపై తనకు అధికారిక సమాచారం లేదన్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని.. ఎవరితో పొత్తు ఉండదని ఉత్తమ్ కుమార్ రెడ్డి తేల్చిచెప్పారు. కేసీఆర్ నిర్లక్ష్యంతో రైతులు ధాన్యాన్ని నష్టాలకు అమ్ముకుంటున్నారన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వరంగల్ రాహుల్ సభను విజయవంతం చేయాలని పార్టీ క్యాడర్‌ కు సూచించారు.

Tags

Read MoreRead Less
Next Story