UTTHAM: బనకచర్లను అంగీకరించే ప్రసక్తే లేదు

తెలంగాణ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్లను అడ్డుకోవడానికి చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని.... ఇంకా ఏం ప్రయత్నాలు చేయాలో అవి కూడా చేస్తా మని తెలిపారు. రెండ్రోజుల్లో ఈ అంశంపై మరిన్ని వివరాలువెల్లడిస్తానని అన్నారు. చాలా తీవ్రంగా తాము బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇప్పటికే కేంద్రం దృష్టికి...
ఇప్పటికే ఈ విషయాన్ని కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ దృష్టికి తీసుకెళ్లామన్న ఉత్తమ్.. తమ అభ్యంతరాలు ఏంటో క్లియర్గా చెప్పామని అన్నారు. బనకచర్ల ప్రాజెక్ట్ను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ... త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని కీలక ప్రకటన చేశారు. బనకచర్ల ప్రాజెక్టు పై ఏపీ ప్రభుత్వం కేంద్రం ముందుకు ప్రతిపాదనలు తీసుకెళ్లనుంది. పోలవరం నుంచి బనకచర్లకు నీటి తరలింపు ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖకు తెలంగాణ అధికారులు పూర్తి వివరాలు అందించనున్నారు. రూ.81 వేల కోట్లతో ప్రాజెక్టు ను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. మరోవైపు కరువు ప్రాంతం రాయలసీమను సస్యశ్యామలం చేయడానికి, పల్నాడు ప్రాంతాన్ని దుర్భిక్షానికి దూరం చేసేందుకు తలపెట్టి న పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకానికి సహకరించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రాన్ని అభ్యర్థించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com