VAKATI: సర్పంచ్ నుంచి మంత్రిగా వాకిటి

గ్రామ సర్పంచి నుంచి మొదలై అంచెలంచెలుగా ఎదిగిన వాకిటి శ్రీహరిని మంత్రి పదవి వరించింది. రాజకీయాల్లో చేరినప్పటి నుంచి ఎన్ఎస్యూఐ, యూత్ కాంగ్రెస్ సహా పార్టీకి వివిధ హోదాల్లో సేవలందించారు. పార్టీకి విధేయుడిగా ఉంటూ, పని చేసుకుంటున్న వాకిటి శ్రీహరికి సామాజిక సమీకరణాల్లో భాగంగా మంత్రి పదవి వరించింది. వాకిటి శ్రీహరికి మంత్రి పదవితో తెలంగాణలోనే అత్యంత ఎక్కువ జనాభా కలిగిన ముదిరాజ్ సామాజిక వర్గానికి మంత్రివర్గంలో చోటు దక్కినట్లు అయింది.
సర్పంచ్ టూ మంత్రి
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు మరో మంత్రి పదవి దక్కింది. సామాజిక సమీకరణాల్లో భాగంగా బీసీ సామాజిక వర్గానికి చెందిన మక్తల్ శాసనసభ్యుడు వాకిటి శ్రీహరిని కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రి వర్గంలోకి తీసుకుంది. 2001లో మహబూబ్నగర్ జిల్లాలోనే అత్యధిక మెజారిటీతో మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికై రాజకీయ ప్రస్థానం మొదలు పెట్టారు. అదే సమయంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగానూ పని చేశారు. 2014లో జడ్పీటీసీగా, మహబూబ్నగర్ జిల్లా పరిషత్ కాంగ్రెస్ పార్టీ ప్లోర్ లీడర్గానూ సేవలందించారు.
"పార్టీ లైన్ దాటితే పదువులు ఉండవ్"
గ్రేటర్ హైదరాబాద్తో పాటు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి మంత్రివర్గంలో ఎవరూ లేనందున వికారాబాద్ ఎమ్మెల్యే, సభాపతి ప్రసాద్కుమార్ను మంత్రివర్గంలోకి తీసుకుని అదే సామాజికవర్గానికి చెందిన మరొకరికి సభాపతి పదవి ఇస్తే ఎలా ఉంటుందనే అంశం కూడా పార్టీ పరిశీలనలో ఉన్నట్లు నేతలు చెబుతున్నారు. మంత్రి పదవుల కోసం గట్టిగా పోటీపడుతున్న వారిలో ఒకరికి చీఫ్ విప్ పదవి ఇచ్చి సర్దుబాటు చేసే అవకాశాలున్నాయి. గత 4 రోజులుగా హైదరాబాద్లోనే ఉన్న మీనాక్షి నటరాజన్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృతంగా చర్చించిన నేపథ్యంలో సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని విస్తరణ ఉండాలని, అధిష్ఠానానికి సూచించినట్లు కూడా ప్రచారం జరుగుతోంది. పార్టీ లైనుకు భిన్నంగా ఎవరు మాట్లాడినా తదుపరి పదవుల్లో వారికి ప్రాధాన్యం ఉండదని స్పష్టం చేస్తున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణ తర్వాత నాలుగైదు రోజుల్లో కొత్త మంత్రులకు శాఖ కేటాయింపు సహా ఉన్న మంత్రుల శాఖల్లోనూ మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com