Vanasthalipuram: పిల్లిని ఎత్తుకెళ్లారు... కెమెరా కంటికి చిక్కారు
By - Subba Reddy |10 Jan 2023 1:00 PM GMT
అరుదైన పిల్లిని దొంగలించిన గుర్తుతెలియని వ్యక్తులు
హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్స్టేషన్ పరిధిలో మంగళవారం వింత సంఘటన చోటు చేసుకుంది. అరుదైన జాతి పిల్లిని గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పెంపుడు జంతువుల ప్రేమికులు ఈ ఘటన పట్ల ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
మహమద్ అనే వ్యక్తి 18 నెలల వయసున్న పిల్లిని ఎవరో ఎత్తుకు పోయారని వనస్థలిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆ అరుదైన పిల్లి ఖావ్ మానీ సంతతికి చెందినది, దానిని డైమండ్ ఐస్ పిల్లి అని కూడా అంటారు. థాయిలాండ్ లో రూ.50 వేలకు పిల్లిని కొనుగోలు చేసి తెచ్చుకున్నట్లు యజమాని తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com