SAD: చెరువులో మునిగి ముగ్గురు పిల్లలు, తల్లి మృతి

X
By - Sathwik |30 March 2025 10:45 AM IST
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం వెంకటాపురంలో తీవ్ర విషాదం నెలకొంది. చెరువులో పడి ముగ్గురు పిల్లలు మృతి చెందారు. వారిని రక్షించేందుకు చెరువులోకి దిగిన తల్లి కూడా నీటిలో మునిగి చనిపోయారు. మృతులను మౌనిక (26), మైథిలి (10), అక్షర (8), వినయ్గా గుర్తించారు. పిల్లలంతా స్నానం చేసేందుకు చెరువులో దిగారు. అక్కడ భారీ గుంత ఉండటంతో వారు మునిగిపోయారు. పిల్లలను కాపాడేందుకు మౌనిక చెరువులో దిగి ఆమె కూడా మృతి చెందారు. పిల్లల మృతదేహాలను వెలికితీయగా, మౌనిక కోసం గాలిస్తున్నారు. మౌనిక తన పిల్లలతో కలిసి చెరువు వద్ద బట్టలు ఉతకడానికి వెళ్లారని పోలీసులు వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com