వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికల కమిటీ ప్రకటించిన కాంగ్రెస్‌

వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికల కమిటీ ప్రకటించిన కాంగ్రెస్‌
వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికల కమిటీలను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రకటించారు. వరంగల్‌ కమిటీలో కన్వీనర్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కో-కన్వీనర్‌గా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వ్యవహరించనున్నారు.

వరంగల్‌, ఖమ్మం కార్పొరేషన్‌కు ఎన్నికల కమిటీలను టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ప్రకటించారు. వరంగల్‌ కమిటీలో కన్వీనర్‌గా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కో-కన్వీనర్‌గా ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు వ్యవహరించనున్నారు. ఖమ్మం నగర పాలక సంస్థ కమిటీ కన్వీనర్‌గా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్, సభ్యులుగా భట్టి విక్రమార్క, డీసీసీ అధ్యక్షుడు దుర్గా ప్రసాద్, మాజీ కేంద్ర మంత్రులు రేణుకా చౌదరి, బలరామ్‌ నాయక్‌ తదితరులను నియమించారు. వరంగల్‌, ఖమ్మం నగరపాలక సంస్థలకు; సిద్దిపేట, అచ్చంపేట, జడ్చర్ల, కొత్తూరు, నకిరేకల్‌ మున్సిపాలిటీలకు 30న పోలింగ్‌ జరుగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story