Warangal: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో..

Warangal: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి.. రోడ్డు ప్రమాదంలో..
Warangal: ఉన్న ఊరుని కన్నతల్లిదండ్రులను విడిచి పై చదువుల పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో, మరొకటో విదేశాలకు వెళ్లేవారు ఎందరో..

Warangal: ఉన్న ఊరుని కన్నతల్లిదండ్రులను విడిచి పై చదువుల పేరుతోనో, ఉద్యోగం పేరుతోనో, మరొకటో విదేశాలకు వెళ్లేవారు ఎందరో.. మీరు అక్కడ ఉన్నా, ఎక్కడ ఉన్నా మీ పక్కనే మీ నీడలా మీతోనే ఉన్నానంటూ మృత్యువు అవకాశం ఎదురు చూస్తుంటుంది.

వరంగల్‌కు చెందిన గుళ్లపల్లి పావని రెండు నెలలక్రితమే ఉన్నత చదువులు చదివేందుకు అమెరికా వెళ్లింది. కానీ అంతలోనే ఘోరం జరిగింది. గత నెల 25న కనెక్టికట్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పావని మృతి చెందింది. పావని మరణించిన 9 రోజులకు డెడ్‌బాడీ స్వస్థలం చేరుకుంది.

తల్లిదండ్రులు కల్పన, రమేశ్, సోదరి వాసవి, మేనత్తలు, మేనమామలు, చిన్నమ్మలు, బాబాయిలు పావని మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరయ్యారు. కూతురు ఇకలేదన్న విషయాన్ని జీర్ణించుకోలేని తల్లిని ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

కన్నతండ్రి దు:ఖాన్ని దిగమిగుకుంటూ భార్యని ఓదార్చే ప్రయత్నం చేశారు. అనంతరం పావని అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు రామా బాబూరావు, దండు దయాసాగర్‌తో పాటు స్థానికులు పాల్గొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story