Kancherla Bhupal Reddy : నల్గొండలో బీఆర్ఎస్ రైతు ధర్నా నిర్వహించి తీరుతాం : కంచర్ల

X
By - Manikanta |21 Jan 2025 1:30 PM IST
నల్గొండ పట్టణంలో రైతు మహా ధర్నాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరుకానున్నారు. ఇక్కడ రైతు ధర్నా నిర్వహించి తీరుతామన్నారు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి. నల్గొండ దద్దరిల్లేలాగా ధర్నా ఉంటుందన్నారు. ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని నిర్బంధాలు పెట్టినా బీఆర్ఎస్ పార్టీ రైతుల తరఫున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.. రేపు నల్గొండకు కేటీఆర్ వస్తారని... ధర్నాలో పాల్గొంటారని తెలిపారు. పోలీసులు ప్రజాస్వామ్యయుతంగా, చట్టబద్ధంగా నడుచుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com