YS Sharmila: అక్కని లోపలేసిర్రు....

యువజన శ్రామిక రైతు తెలంగాణా పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్ టాంక్ బండ్ వద్ద మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని ట్యాంక్ బండ్ పై రుద్రమదేవి విగ్రహం వద్ద చేపట్టిన నిరసన కార్యక్రమంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందంటూ షర్మిల ప్రభుత్వాన్ని దుయ్యబెట్టారు. కేసీఆర్ నాయకత్వంల ో రాష్ట్రం మహిళలకు ల్యాండ్ మైన్లు నాటిన ప్రాంతంలా మారిపోయిందంటూ వ్యాఖ్యానించారు. దాడుల రూపంలో నాటిన మైన్లు ఎప్పుడు పేలతాయో అర్ధం కావడంలేదని అన్నారు. లైంగిక దాడులు, హత్యల విషయంలో రాష్ట్ర ముందు వరుసలో ఉందని తెలిపారు. ఇక కేటీఆర్ లాంచ్ చేసిన భరోసా యాప్ పనిచేయడంలేదని, తానే స్వయంగా యాప్ ను వినియోగించేందుకు ప్రయత్నించగా అది పనిచేయడంలేదని గ్రహించినట్లు వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com