YS Sharmila: రాజకీయ ప్రయోజనాల కోసమే నేతలు పార్టీలు మారుతున్నారు: షర్మిల

X
By - Divya Reddy |5 May 2022 7:40 PM IST
YS Sharmila: తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు.
YS Sharmila: తెలంగాణ ప్రభుత్వం రైతులను పట్టించుకోవట్లేదని.. వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మండిపడ్డారు. ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో షర్మిల యాత్ర కొనసాగుతోంది. యాత్రలో భాగంగా గంగారం గ్రామంలో రైతుగోస పేరుతో షర్మిల ధర్నా చేశారు. రాజకీయ స్వార్ధ ప్రయోజనాల కోసమే.. నేతలు పార్టీలు మారుతున్నారని ఈ సందర్భంగా షర్మిల విమర్శించారు. ఇక రైతు సంక్షేమం అంటూ సీఎం కేసీఆర్ అన్నదాతలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. వడ్లు కొనలేని సీఎం మాకొద్దు అంటూ నినాదాలు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com