Sharmila: షర్మిల.. పార్టీ ఆఫీసు ముందు ఆమరణ నిరహార దీక్ష

Sharmila: షర్మిల.. పార్టీ ఆఫీసు ముందు ఆమరణ నిరహార దీక్ష
Sharmila: పాదయాత్రకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల...పార్టీ ఆఫీసు ముందు ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు.

YS Sharmila: పాదయాత్రకు అనుమతివ్వాలంటూ వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల...పార్టీ ఆఫీసు ముందు ఆమరణ నిరహార దీక్ష కొనసాగిస్తున్నారు. అరెస్టు చేసిన తమ కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందన్నారు. మరోవైపు లోటస్‌పాండ్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.


షర్మిలకు అపోలో వైద్యులు వైద్య పరీక్షలు చేశారు. వైఎస్ షర్మిల కనీసం మంచినీళ్లు కూడా తాగలేదని..ఆమె ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తోందన్నారు. మంచి నీళ్లు తీసుకోకపోవడంతో డీ హైడ్రేషన్ అవుతోందన్నారు. కిడ్నీలకు ప్రమాదం పొంచి ఉందన్నారు వైద్యులు. రక్త పరీక్షలు నిర్వహించినట్లు చెప్పారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆరోగ్యం మరింత క్షీణించే ప్రమాదం ఉందన్నారు.సాయంత్రం మరోసారి వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు.

Tags

Read MoreRead Less
Next Story