ఏడిద శ్రీరాం, ఏడిద రాజా లకు కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్
![ఏడిద శ్రీరాం, ఏడిద రాజా లకు కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్ ఏడిద శ్రీరాం, ఏడిద రాజా లకు కే.విశ్వనాథ్ స్మారక అవార్డ్](https://www.tv5news.in/h-upload/2023/03/24/927845-whatsapp-image-2023-03-24-at-183013.webp)
శ్రీ శోభ్ క్రుత్ నామ సంవత్సర ఉగాది పండుగ సందర్భంగా వంశీ ఇంటర్నేషనల్, వంశీ కల్చరల్ ,ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆద్వర్యంలో ఉగాది వేడుకలు హైదరాబాద్ త్యగరాయ గాన సభలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు డా.కే.వి.రమణాచారి, ప్రముఖ రచయత యండమూరి వీరేంద్రనాద్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లోని ప్రముఖులను ఉగాది పురస్కారాలతో సత్కరించారు. ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ దర్శకుడు, కళా తపస్వి , దాదాసాహెబ్ పాల్కె అవర్ద్ గ్రహీత కే.విశ్వనాథ్ స్మారక అవార్డును పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ అధినేత ఏడిద నాగేశ్వరావు కమారులు ఏడిద శ్రీరాం, ఏడిద రాజా లకు బహుకరించారు . అనంతరం వారు మాట్లాడుతూ కే.విశ్వనాథ్ తో ఉన్న అనుబంధం గురించి గుర్తు చేసుకొని తమ సంతోషాన్ని వ్వక్తపరిచారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com