ఆకట్టుకుంటున్న మరువ తరమా ఫస్ట్ సాంగ్..

ఆకట్టుకుంటున్న మరువ తరమా ఫస్ట్ సాంగ్..
యూత్ మనసు దోచేస్తున్న మ్యూజికల్ మెలోడీ

ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు తెలుగు నాట ఎప్పడూ ఆదరణ లభిస్తూనే ఉంటుంది. ఈ కోవలోనే మనసుకు హత్తుకునే ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది 'మరువ తరమా' మూవీ. అద్వైత్ ధనుంజయ హీరోగా అతుల్యా చంద్ర, అవంతిక నల్వా హీరోయిన్లుగా రూపొందుతున్న ఈ సినిమాను సిల్వర్ స్క్రీన్ పిక్చర్స్ బ్యానర్ పై గిడుతూరి రమణ మూర్తి, రుద్రరాజు విజయ్ కుమార్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చైతన్య వర్మ నడింపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉన్న ఈ మూవీ నుంచి తాజాగా పాదం పరుగులు తీసే.. సాంగ్ రిలీజ్ చేశారు. చైతన్య వర్మ రాసిన లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. రోహిత్ ఆలపించగా ట్యూన్ అందించిన విజయ్ బుల్గనిన్ అదరహో అనిపించుకున్నారు.

Tags

Read MoreRead Less
Next Story