ఆ అనుభూతితో పోలిస్తే ఆస్కార్‌ టీ తాగినట్టుగా అనిపిస్తుంది.. కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు

ఆ అనుభూతితో పోలిస్తే ఆస్కార్‌ టీ తాగినట్టుగా అనిపిస్తుంది.. కీరవాణి ఆసక్తికర వ్యాఖ్యలు
ఆస్కార్ ఎంతటి విలువైందో.. తన జీవితంలో ఆ అత్యున్నత పురస్కారం ఎంత ప్రత్యేకమైందో మరోసారి స్పష్టంచేశారు

ఆస్కార్ గ్రహీత, సంగీత దర్శకులు ఎమ్ ఎమ్ కీరవాణి ఆస్కార్ అవార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆస్కార్ ఎంతటి విలువైందో.. తన జీవితంలో ఆ అత్యున్నత పురస్కారం ఎంత ప్రత్యేకమైందో మరోసారి స్పష్టంచేశారు. బతికితే ఒక్కరోజైనా రామోజీరావులా బతకాలి అని తన భార్య అంటూ ఉంటుందని గుర్తు చేసుకున్నారు. అలాంటి రామోజీరావును తాను కలవడానికి వెళ్లినపుడు జరిగిన సంఘటనను, రామోజీరావు చెప్పిన మాటలను బయటపెట్టారు. హైదరాబాద్‌ శిల్ప కళావేదికలో తెలుగు చలన చిత్ర పరిశ్రమ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో కీరవాణి ఈ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

మీరు ఆస్కార్ తీసుకురండి అని రామోజీరావు అనగానే తాను ఆశ్చర్యపోయానని చెప్పారు. రామోజీరావు ఆస్కార్ అవార్డును అంత విలువ ఇస్తున్నారంటే అందులో ఏదో ప్రత్యేకం ఉందని తాను అనుకున్నానని తెలిపారు. అయితే వస్తుందా.. లేదా? అని అస్కార్ విజేతల వివరాలు ప్రకటించే సమయంలో పడిన టెన్షన్‌ గురించి వివరించారు. రామోజీరావు కోసమైనా ఆస్కార్ రావాలనుకున్నా.. ఎట్టకేలకు ఆ అత్యున్నత పురస్కారం వరించిందన్నారు. ట్రిపుల్ ఆర్ టీమ్ సమిష్టి కృషితోనే ఆస్కార్ సాధించామని.. ఆ అనుభూతితో పోలిస్తే ఆస్కార్‌ టీ తాగినట్టుగా అనిపిస్తుందని కీరవాణి తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story