Tollywood: ఆగస్ట్ 18న 'ఆది కేశవ' రిలీజ్

Tollywood: ఆగస్ట్ 18న ఆది కేశవ రిలీజ్
మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన తొలిసారిగా శ్రీలీల


మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ 'ఆదికేశవ' ఆగస్ట్ 18న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి. ఇందులో వైష్ణమ్ సరసన శ్రీలీల జతకట్టింది. ఈ రెండు నిర్మాణ సంస్థలు విభిన్నమైన, ఆసక్తికరమైన చిత్రాలను అందిస్తున్నాయి. ప్తస్తుతం 'ఆదికేశవ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.

యాక్షన్ ఎంటర్ టైనర్ కోసం మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ తో, రీసెంట్ సెన్సేషన్ శ్రీలీల తొలిసారి జతకట్టింది. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఆదికేశవ యాక్షన్ టీజర్‌... ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంది. సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా ఇటీవల విడుదలైన కూల్ టీజర్ కూడా యువతను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రేక్షకుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ, ఆదికేశవ సినిమాని ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 18న విడుదల చేస్తున్నట్లు చిత్ర యునిట్ తాజాగా ప్రకటించింది. ఈ సినిమాను శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

జాతీయ అవార్డు గ్రహీత మలయాళ స్టార్ యాక్టర్ జోజు జార్జ్ ఈ సినిమాతో తెలుగు పరిశ్రమలోకి అడుగు పెడుతున్నారు. అలనాటి తార రాధిక, అపర్ణా దాస్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. జీవీ ప్రకాష్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story