టీవీ యాంకర్ కత్తికార్తీకపై చీటింగ్ కేసు నమోదు
By - Nagesh Swarna |17 Oct 2020 5:02 AM GMT
టీవీ యాంకర్ కత్తి కార్తీకపై చీటింగ్ కేసు నమోదైంది. తక్కువ ధరకు భూమి ఇప్పిస్తామంటూ తమను నమ్మించి కోట్ల రూపాయలు వసూలు చేశారంటూ దొరస్వామి, శ్రీధర్ లు బంజారాహిల్స్ పోలీస్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో కత్తికార్తీకతోపాటు మరో ఆరుగురిపై పై బంజాహిల్స్ పోలీసులు చీటింగ్ కేసు నమోదుచేశారు. నగర శివారులో అతితక్కువ ధరకు 52 ఎకరాల స్థలాన్ని డెవల్మెంట్ కోసం ఇప్పిస్థామని చెప్పారని, డబ్బులు ఇచ్చిన తర్వాత భూములు తమకు విక్రయించకుండా మోసంచేశారంటూ వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com