Cinema: ఫిబ్రవరి 24న 'పులి మేక'
లావణ్య త్రిపాఠి, ఆది సాయికుమార్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో జీ 5, కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ కాంబోలో రూపొందుతోన్న సస్పెన్స్ థ్రిల్లింగ్ ఒరిజినల్ 'పులి మేక' టీజర్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ శుక్రవారం రిలీజ్ చేసి అభినందనలు తెలిపాడు. ఇండియాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ ఓటీటీల్లో ఒకటైన జీ 5 తమ ఆడియెన్స్ కోసం తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, మరాఠీ, గుజరాతీ, బెంగాలీ సహా ఇతర భాషల్లో అపరిమితమైన, కొత్తదైన, వైవిధ్యమైన కంటెంట్ను అందిస్తోంది. ఈ ఓటీటీ లైబ్రరీలో ఫిబ్రవరి 24న మరో బెస్ట్ ఒరిజినల్గా జాయిన్ కావటానికి సిద్ధమవుతుంది 'పులి మేక'. ఈ ఒరిజినల్ కోసం జీ 5 కోన ఫిల్మ్ కార్పొరేషన్తో జాయిన్ అయ్యింది. లావణ్య త్రిపాఠి, ఆది సాయి కుమార్, సిరి హన్మంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. జీ 5లో ఫిబ్రవరి 24న స్ట్రీమింగ్ కాబోతోంది.
'పులి మేక' టీజర్ను గమనిస్తే .. పోలీసులను మృగంలాంటి వేషధారణతో ఉన్న వ్యక్తి వరుసగా చంపేస్తుంటాడు. అసలు ఈ హత్యలను ఎవరు చేస్తున్నారనేది తెలియక డిపార్ట్మెంట్ తలలు పట్టుకుంటుంది. వెంటనే కేసుని సాల్వ్ చేయటానికి, హంతకుడిని పట్టుకోవటానికి పోలీస్ డిపార్ట్మెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను ఏర్పాటు చేస్తుంది. దానికి హెడ్ కిరణ్ ప్రభ (లావణ్య త్రిపాఠి). అదే టీమ్లో ఫోరెన్సిక్ టీమ్ మెంబర్ ప్రభాకర్ శర్మ (ఆది సాయికుమార్) కనిపిస్తున్నారు. కేసుని సాల్వ్ చేయటానికి పోలీసులు కష్టపడుతుంటే మరో వైపు మీడియా, పై అధికారుల నుంచి తెలియని ఒత్తిడి వారిపై ఉంటుంది. ఈ సన్నివేశాలను చాలా ఇంట్రెస్టింగ్ వేలో టీజర్గా కట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com