వివాదంలో క్రేజి అంకుల్స్.. సినిమాని ఆపేయాలంటూ డిమాండ్..!

వివాదంలో క్రేజి అంకుల్స్.. సినిమాని ఆపేయాలంటూ డిమాండ్..!
మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి బి రత్న డిమాండ్ చేశారు.

మహిళలను కించ పరిచే విధంగా రూపొందించిన క్రేజీ అంకుల్స్ సినిమా విడుదలను వెంటనే నిలిపివేయాలని తెలంగాణ మహిళ హక్కుల వేదిక అధ్యక్షురాలు రేఖ, కార్యదర్శి బి రత్న డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం సోమజిగూడా ప్రెస్ క్లబ్ లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తాజాగా విడుదలకి సిద్దంగా ఉన్న క్రేజీ అంకుల్స్ సినిమా ట్రైలర్ లోనే మహిళలను కించ పరిచే సన్నివేశాలు ఉన్నాయని ఆరోపించారు.

మహిళ లను ఆట వస్తువు గా చూపిస్తూ, అసభ్య పద జాలంతో కూడిన సినిమా రూపోందించడం సరికాదు అన్నారు. కేవలం ట్రైలర్ లోనే అంత అసభ్యత ఉంటే ఇక సినిమా మొత్తం ఎలా ఉంటుందో ఊహించవచ్చు అన్నారు. గతంలో కూడా ఇలాంటి సినిమాలు వచ్చాయని. కేవలం డబ్బు సంపాదన కోసమే యావత్ మహిళ జాతిని కించపర్చడం అన్యాయమన్నారు. వెంటనే సినీ నిర్మాత, దర్శకులు, నటీనటులు యావత్ మహిళ లోకానికి బహిరంగ క్షమాపణ చెప్పి సినిమా విడుదలను నిలిపివేయాలని హెచ్చరించారు.

లేకుంటే యావత్ తెలుగు రాష్ట్రాల మహిళ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని చెప్పారు. ఇండస్ట్రీలో దర్శకుడు ఈ. సత్తిబాబుకి మంచి పేరుంది. ఇప్పటిదాకా ఆయన చేసిన ఫ్యామిలీ సినిమాలను కలిసి కూర్చొని చూడొచ్చు. ఆ సినిమాల్లో మంచి కామెడీని పండించాడయన.. తాజాగా ఆయన అడల్ట్ కామెడీ చేస్తున్నాడు.. ఆయన జబర్దస్త్ లాంటి షోలని డైరెక్ట్ చేసుకోమని చెప్పండి.. ఇలాంటి సినిమాలు తీసి సమాజాన్ని చెడగొడతారా అని ఫైర్ అయ్యారు. బాలీవుడ్ లో రాజ్ కుంద్రా సీక్రెట్ గా అడల్ట్ కంటెంట్ తీస్తే.. ఇలాంటి నిర్మాతలు డైరెక్ట్ గా ముసుగులో ఇలాంటి బూతు సినిమాలు పబ్లిక్ గా తీసి రిలీజ్ చేస్తారా అని అన్నారు.



Tags

Read MoreRead Less
Next Story