Venkatesh : నారప్ప కంటే ముందుగా దృశ్యం- 2...!

Venkatesh : నారప్ప కంటే ముందుగా దృశ్యం- 2...!
Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇప్పుడు అందరికంటే ముందు వరుస సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే నారప్ప షూటింగ్ అయిపోగా, తాజాగా ‘దృశ్యం 2’ సినిమాకు కూడా కంప్లీట్ చేశారు.

Venkatesh : విక్టరీ వెంకటేష్ ఇప్పుడు అందరికంటే ముందు వరుస సినిమాలను ఫినిష్ చేస్తున్నారు. ఇప్పటికే నారప్ప షూటింగ్ అయిపోగా, తాజాగా 'దృశ్యం 2' సినిమాకు కూడా కంప్లీట్ చేశారు. అయితే కరోనా వలన ఈ రెండు సినిమాల రిలీజ్ వాయిదా పడ్డాయి. అయితే ఇప్పుడు దృశ్యం 2 చిత్రాన్ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు నిర్మాత సురేష్ బాబు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాని ముందుగా ఓటీటీలో రిలీజ్ చేసి, థియేటర్లు తెరుచుకున్న తరువాత నారప్ప సినిమాని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. కాగా ఈ సినిమాకి జీతూ జోసెఫే దర్శకత్వం వహించారు. వెంకటేష్ సరసన మీనా హీరోయిన్ గా నటించింది. కాగా దృశ్యం సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. అటు ప్రస్తుతం వెంకటేష్ ఎఫ్ 3 చిత్రాన్ని చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story