Karate Kalyani: కలెక్టర్ను కలిసి అన్ని విషయాలు వెల్లడించాను: కరాటే కళ్యాణి
By - Divya Reddy |17 May 2022 12:24 PM GMT
Karate Kalyani: తనను బదునాం చేయడానికే ఎవరో కావాలనే ఛైల్డ్ వెల్ఫర్ అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు కరాటే కళ్యాణి.
Karate Kalyani: తనను బదునాం చేయడానికే ఎవరో కావాలనే ఛైల్డ్ వెల్ఫర్ అధికారులకు ఫిర్యాదు చేశారన్నారు సినీనటి కరాటే కళ్యాణి. దత్తత విషయంలో తనమీద వస్తున్న కథనాలపై హైదరాబాద్ కలెక్టర్ను కలిసి వివరణ ఇచ్చామన్నారు. తనకు ఇప్పటి వరకు ఎలాంటి నోటీసులు అందలేదన్నారు. అసలు దత్తత అనేది జరుగలేదని ఆమె వెల్లడించారు. .
దత్తత అనేది జరుగనప్పుడు.. అది లీగలా.. ఇల్లీగలా.. అనేది మాట్లాడగం సరైంది కాదన్నారు కరాటే కళ్యాణి లాయర్. మీడియాలో వస్తున్న వార్తలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కళ్యాణి ఇంట్లో సోదాలు జరుగుతున్నాయని... ఆమె అజ్ఞాతంలో వెళ్లారనే వార్తల్లో వాస్తవం లేదన్నారు. పాప కుటుంబంతో ఉన్న పరిచయం వల్లే చనువు పెరిగిందన్నారు. ఎవరో ఫిర్యాదు చేయడం వల్ల ఈ వివాదం మొదలైందన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com