కీర్తి సురేశ్ కల నెరవేరిన వేళ!
మహానటి సినిమాతో మంచి ఫేం సంపాదించుకుంది నటి కీర్తి సురేష్.. ఈ సినిమా తర్వాత గ్లామర్ పాత్రల కన్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది.

మహానటి సినిమాతో మంచి ఫేం సంపాదించుకుంది నటి కీర్తి సురేష్.. ఈ సినిమా తర్వాత గ్లామర్ పాత్రల కన్నా.. ప్రాధాన్యత ఉన్న పాత్రలను, కథలను ఎంచుకుంటూ ముందుకు వెళ్తుంది. అందులో భాగంగానే త్వరలో 'వాషి' అనే మలయాళ చిత్రంలో నటించనుంది కీర్తి. అయితే ఈ సినిమాకు ఆమె తల్లిదండ్రులు సురేశ్ కుమార్, రేవతి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తాజాగా వెల్లడించింది.
దాదాపు 7 ఏళ్లకు తన కల నెరవేరుతోందని, తను నటిస్తున్న ప్రాజెక్టును తన తండ్రే నిర్మిస్తుండటం చాలా ఆనందంగా ఉందని కీర్తి తెలిపింది. ఈ మూవీలో టొవిన్ థామస్ లీడ్ రోల్ పోషిస్తుండగా విష్ణు జీ రాఘవ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఏడాదే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. కాగా ప్రస్తుతం కీర్తి తెలుగులో మహేష్ బాబు సరసన సర్కారు వారి పాట అనే సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జిఎంబి ఎంటర్టైన్మెంట్స్ మరియు 14 రీల్స్ ప్లస్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పరుశురాం దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్ లో జరుగుతుంది.
RELATED STORIES
Khammam: పొలం దున్నుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి..
13 Aug 2022 4:00 PM GMTErrabelli Dayakar Rao: బంజారాలతో కలిసి స్టెప్పులేసిన మంత్రి...
13 Aug 2022 3:45 PM GMTV Srinivas Goud: ఫైరింగ్ వీడియోపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ వివరణ..
13 Aug 2022 3:15 PM GMTNalgonda: నల్గొండలో విషాదం.. రిజర్వాయర్లో ఫార్మసీ విద్యార్థులు...
13 Aug 2022 2:45 PM GMTV Srinivas Goud: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హల్చల్.. పోలీస్ గన్తో...
13 Aug 2022 12:46 PM GMTRevanth Reddy : రేవంత్ రెడ్డికు కరోనా.. పాదయాత్రకు బ్రేక్..
13 Aug 2022 7:22 AM GMT