Keerthy Suresh: ఆ సినిమా తర్వాత నా మైండ్ బ్లాంక్ అయిపోయింది: కీర్తి సురేశ్
Keerthy Suresh: లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పేరు తెచ్చుకున్న హీరోయిన్లకు ఆ తర్వాత కమర్షియల్ చిత్రాల ఆఫర్లు చాలా తక్కువగా వస్తాయి. ఒకవేళ వారు కమర్షియల్ సినిమాలు చేసినా.. ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారో లేదో అన్న భయం ఉంటుంది. కానీ ఈ రెండిటిని కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తూ వెళ్తోంది కీర్తి సురేశ్. ఒవైపు లేడీ ఓరియెంటెడ్ కథలు, మరోవైపు కమర్షియల్ చిత్రాల్లో నటించడంపై కీర్తి ఇటీవల స్పందించింది.
'మహానటి' సినిమాతో అలనాటి నటి సావిత్రి జీవితం గురించి ఈ తరం ప్రేక్షకులకు తెలియజేసింది కీర్తి సురేశ్. సావిత్రి పాత్రలో కీర్తి తప్ప మరెవరూ నటించరేమో అన్నట్టుగా ఉంది తన నటన. అలాంటి తను మహానటి తర్వాత వెంటనే కమర్షియల్ చిత్రాలతో అలరించడం మొదలుపెట్టింది. ఇటీవల మహేశ్తో చేసిన 'సర్కారు వారి పాట'లో కీర్తి ఇంతకుముందు సినిమాలకంటే భిన్నంగా కనిపించి మెప్పించింది.
కమర్షియల్ సినిమాలు, లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు.. సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్లడమే తనకు ఇష్టమంటోంది కీర్తి సురేశ్. ప్రత్యేకంగా ఇలాంటి కథలతోనే ముందుకెళ్లాలని తానెప్పుడూ పరిమితులు పెట్టుకోలేదని చెప్పింది. మహానటి తర్వాత తన మైండ్ బ్లాంక్ అయిపోయిందని, వరుసగా అలాంటి కథలు రావడంతో వాటినే చేసుకుంటూ వెళ్లిపోయానని తెలిపింది. ఇప్పుడు వరుసగా కమర్షియల్ సినిమాలు చేస్తున్నా.. మళ్లీ లేడీ ఓరియెంటెడ్ కథలు వస్తే వాటిని కూడా చేస్తానంటూ స్పష్టం చేసింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com