Keerthy Suresh: 'మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను'.. కీర్తి సురేశ్ ఎమోషనల్ నోట్..

Keerthy Suresh: మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను.. కీర్తి సురేశ్ ఎమోషనల్ నోట్..
Keerthy Suresh: ఇన్నాళ్లకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ ఖుషీలో ఉన్న కీర్తి తాజాగా ఓ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేసింది.

Keerthy Suresh: హీరోహీరోయిన్లు ఎన్ని సినిమాల్లో నటించినా.. వారి కెరీర్‌లో మైలురాయిగా మిగిలిపోయే మూవీ ఒకటి ఉంటుంది. కీర్తి సురేశ్ లైఫ్‌లో అలాంటి మూవీ 'మహానాటి'. అలనాటి నటి సావిత్రి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రం కీర్తి సురేశ్ కెరీర్‌ను నిలబెట్టింది. ఆ సినిమా తర్వాత ఎందుకో కీర్తి కెరీర్ స్లో అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు బ్యాక్ టు బ్యాక్ హిట్స్‌తో ఫుల్ ఖుషీలో ఉన్న కీర్తి తాజాగా ఓ ఎమోషనల్ నోట్‌ను షేర్ చేసింది.


మహేశ్ బాబుతో మొదటిసారి జోడీకడుతూ కీర్తి నటించిన చిత్రమే 'సర్కారు వారి పాట'. ఈ సినిమా మహేశ్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. ప్రేక్షకులందరినీ అలరించి సూపర్ హిట్‌గా నిలిచింది. ఇక దీనితో పాటు కీర్తి లీడ్ రోల్ చేసిన 'సాని కాయిదమ్' కూడా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలయ్యి మంచి రివ్యూలను అందుకుంటోంది. తాను నటించిన రెండు సినిమాలు ఒకేసారి విడుదలయ్యి హిట్ అందుకోవడంతో కీర్తి తన సంతోషాన్ని అభిమానులతో పంచుకుంది.

'యాక్టర్‌గా ఉండడం చాలా కష్టమైన ప్రయాణంలాంటిది. మేము చూసే ఎత్తుపల్లాలే మా గమ్యాన్ని నిర్ణయిస్తాయి. గత కొన్నిరోజులు నన్ను నేను పరీక్షించుకోవడానికి ఉపయోగపడ్డాయి. అప్పుడే నేను ఈ ప్రపంచానికి నా బెస్ట్‌ను చూపించాలంటే ఆగకుండా పనిచేస్తూనే ఉండాలి అని అర్థమయ్యింది. సర్కారు వారి పాట, సాని కాయిదమ్ సినిమాలను ఎంతో ప్రేమతో ఆదిరించినందుకు నా మనసంతా సంతోషంతో నిండిపోయింది.' అని లెటర్‌లో పేర్కొంది కీర్తి.


'నా ఫ్యాన్స్ నా బలం. నేను ఇక్కడ ఉన్నానంటే దానికి కారణం మీరే. దానికి నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. మీ సపోర్ట్ నన్ను కష్టాలను ఎదుర్కునేలా చేస్తుంది. ఒంపికలో తోడుగా ఉంటుంది. అంతే కాకుండా నన్ము నమ్మిన డైరెక్టర్లకు కూడా ధన్యవాదాలు' అంటూ సర్కారు వారి పాట, సాని కాయిదామ్ మూవీ టీమ్స్‌కు పేరుపేరునా ధన్యవాదాలు తెలిపింది కీర్తి సురేశ్.



Tags

Read MoreRead Less
Next Story