ప్రముఖ గేయ రచయిత వెన్నెలకంటి శ్రీనివాస్ కన్నుమూత

X
By - TV5 Digital Team |5 Jan 2021 5:54 PM IST
ప్రముఖ గేయ రచయిత వెన్నెలకంటి శ్రీనివాస్ కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుతో వెన్నెకంటి తుదిశ్వాస విడిచారు.
ప్రముఖ గేయ రచయిత వెన్నెలకంటి శ్రీనివాస్ కన్నుమూశారు. చెన్నైలో గుండెపోటుతో వెన్నెకంటి తుదిశ్వాస విడిచారు. 1957 నవంబర్ 30న నెల్లూరులో జన్మించిన వెన్నెలకంటి.. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఎన్నో అద్భుతమైన పాటలను ఆయన రాశారు. ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాలకు వెన్నెలకంటి రాసిన మాటలు, పాటలు ఎంతో పాపులర్ అయ్యాయి. వెన్నెలకంటి పూర్తిపేరు వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్. ఆయన కుమారుడు శశాంక్ కూడా సినీ రచయితగా కొనసాగుతున్నారు. వెన్నెలకంటి హఠాన్మరణంపై సినీ ప్రముఖుల దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com