Manchu Vishnu: వెండితెరపై మంచు విష్ణు కుమార్తెలు.. లేఖతో ప్రకటన..

Manchu Vishnu: వెండితెరపై మంచు విష్ణు కుమార్తెలు.. లేఖతో ప్రకటన..
Manchu Vishnu: మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు.

Manchu Vishnu: సినీ పరిశ్రమలో తమ వారసులను ఎప్పుడెప్పుడు పరిచయం చేద్దామా అని కొందరు నటీనటులు వెయిట్ చేస్తూ ఉంటారు. సినిమాల్లో హీరో, హీరోయిన్లుగానే కాదు.. చైల్డ్ ఆర్టిస్టులుగా కూడా ఇప్పటికీ ఎంతోమంది వారసులు పరిచయమయ్యారు. తాజాగా మరో హీరో కూడా తన కూతుళ్లను వెండితెరపై పరిచయం చేయడానికి సిద్ధమయినట్టు ప్రకటించాడు.

మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు మంచు విష్ణు. కెరీర్ మొదటి నుండి ఎక్కువగా కమర్షియల్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ఓ మార్క్‌ను క్రియేట్ చేసేసుకున్నాడు. ప్రస్తుతం ఇషాన్ సూర్య అనే డెబ్యూ డైరెక్టర్‌తో కలిసి 'జిన్నా' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో పాయల్ రాజ్‌పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా జిన్నా సినిమా నుండి ఓ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు విష్ణు.

మంచు విష్ణు కూతుళ్లు అరియానా, వివియానా.. జిన్నా సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇస్తున్నారని ముందు నుండే వార్తలు వస్తున్నాయి. వీటన్నింటిపై ఇటీవల విష్ణు ఓ క్లారిటీ ఇచ్చాడు. తన కెరీర్ గురించి ఓ లేఖలో వివరిస్తూ.. తన కూతుళ్లు అరియానా, వివియానాను సింగర్స్‌గా, నటీమణులుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను అంటూ స్పష్టం చేశాడు. ఇక జిన్నా సినిమాలో వీరిద్దరు పాడిన ఫ్రెండ్‌షిప్ పాట జులై 24న విడుదల కానుందని ప్రకటించాడు.


Tags

Read MoreRead Less
Next Story