Mumbai: హమ్మయ్య... మొత్తానికి ఒకింటిదైంది..

Mumbai: హమ్మయ్య... మొత్తానికి ఒకింటిదైంది..
ముంబైలో మకాం వేసిన సమంత; ఇల్లు కొనుగోలు..

మొత్తానికి సమంత ఇన్స్టాలో మళ్లీ యాక్టివ్ గా మారింది. తన సినిమాల గురించి, తన గురించి ఎప్పటికప్పుడు కొత్త అప్ డేట్లు ఇస్తూ ఫ్యాన్స్ తో టచ్ లో ఉండేందుకు ప్రయత్నిస్తోంది. ఇక తాజాగా అమ్మడు పోస్ట్ చేసిన ఓ పిక్ టిన్సెల్ టౌన్ లో కొత్త డిస్కషన్స్ కు లేవనెత్తింది. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత చెన్నైకి షిఫ్ట్ అయిపోతుందని అందరూ భావించారు. కొంతకాలంగా అమ్మడు సైలెంట్ అయిపోవడంతో అదే నిజమని అనుకున్నారు. అయితే తాజా అప్ డేట్ ప్రకారం సమంత హైదరాబాద్ నుంచి మకాం మార్చేసిందని ఖరారు అయింది. అయితే, దాన్ని చెన్నైకి షిఫ్ట్ చేయలేదు. నేరుగా ముంబైలో మకాం వేసేసింది. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటోన్న సమంత ముంబైలోని సీ ఫేసింగ్ అపార్ట్మెంట్ ఒకటి ఖరీదు చేసినట్లు తెలుస్తోంది. 15 కోట్ల రూపాయిలు విలువగల 3 బెడ్ రూమ్ అపార్ట్మెంట్ కొనుగోలు చేసిందని తెలుస్తోంది. ఇక తన కొత్త అపార్ట్ మెంట్ బాల్కనీ నుంచి సీ వ్యూ ను క్లిక్ మనిపించి తన ఇన్స్టాలో పోస్ట్ చేసింది అమ్మడు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది అనడంలో సందేహమేలేదు.



Tags

Read MoreRead Less
Next Story