Nithya Menen: 'మహానటి'ని నిత్యామీనన్ రిజెక్ట్ చేసింది అందుకే..! నిర్మాత క్లారిటీ..

Nithya Menen: మహానటిని నిత్యామీనన్ రిజెక్ట్ చేసింది అందుకే..! నిర్మాత క్లారిటీ..
Nithya Menen: ‘మహానటి’ కీర్తి సురేశ్‌కు లైఫ్ ఇచ్చింది. సావిత్రి పాత్రలో తను ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది.

Nithya Menen: అలనాటి నటి సావిత్రి గురించి ఈరోజుల్లో చాలా తక్కువమందికి తెలుసు. అందుకే ఆ కథను ఈ తరం ప్రేక్షకులకు పరిచయం చేసే బాధ్యతను తీసుకున్నాడు యంగ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్. అయితే ఆ పాత్ర కోసం ముందుగా నిత్యామీనన్‌ను తీసుకోవాలి అనుకున్నారు మేకర్స్. కానీ అనుకోని కారణాల వల్ల సీన్‌లోకి కీర్తి సురేశ్ వచ్చి మార్కులన్నీ కొట్టేసింది. అసలు నిత్యా ఈ సినిమా నుండి ఎందుకు తప్పుకుంది అనేదానికి ఇటీవల ఈ మూవీ నిర్మాత సమాధానమిచ్చారు.


'మహానటి' చిత్రం కీర్తి సురేశ్‌కు కొత్త లైఫ్ ఇచ్చింది. సావిత్రి పాత్రలో తను ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతే కాకుండా తనకు నేషనల్ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. కానీ కీర్తికంటే ముందు సావిత్రి పాత్రకు సరిగ్గా సరిపోతుందంటూ నిత్యామీనన్‌ను సంప్రదించారట మూవీ టీమ్. ఈ విషయం మూవీ నిర్మాత అశ్వినిదత్ తెలిపారు. నిత్యామీనన్ పేరు నేరుగా ప్రస్తావించకపోయినా.. ఓ మలయాళ హీరోయిన్‌ను మహానటిలో తీసుకోవాలి అనుకున్నామని చెప్పుకొచ్చారు.


మహానటి సినిమాలో సావిత్రి జీవితంలోని చీకటి కోణాలు కూడా చూపించారు. తాను ఎదుర్కున్న కష్టాల వల్ల సావిత్రి తాగుడుకు అలవాటు పడిన విషయం కూడా చెప్పుకొచ్చారు. అయితే తాగే సన్నివేశాలు ఉంటే నిత్యా సినిమా చేయనని చెప్పేసిందట. అయితే అలాంటి ముఖ్యమైన ఘట్టాన్ని మార్చడం కష్టం కాబట్టి అశ్వినిదత్ కూడా హీరోయిన్‌ను మార్చేద్దామని సలహా ఇచ్చారట. కాకపోతే సీనియర్ ఎన్‌టీఆర్ బయోపిక్‌లో మాత్రం నిత్యామీనన్ కాసేపు సావిత్రిలాగా నటించి అలరించింది.

Tags

Read MoreRead Less
Next Story