ప్రదీప్, రష్మిలకు అరుదైన ఘనత..

ప్రదీప్, రష్మిలకు అరుదైన ఘనత..
స్ఫూర్తివంతుల జాబితాలో చోటు సంపాదించారు.

బుల్లి తెర ప్రేక్షకులకు ప్రియమైన యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, రష్మీ గౌతమ్.. అరుదైన ఘనతను సాధించారు. ప్రముఖ బ్రిటన్ జర్నలిస్టు కిరణ్ రాయ్ 400 మంది స్ఫూర్తివంతుల జాబితాలో చోటు సంపాదించారు. ఆసియాలోని భారత్, పాకిస్థాన్, అఫ్గానిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలో ఎంపిక చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ ఈ జాబితాలో అగ్ర స్థానంలో నిలిచారు.

అలాగే సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, అద్నాన్ సమీ, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ప్రతిభావంతుల జాబితాలో తమకీ స్థానం దక్కడం ఆనందాన్నిచ్చిందని రష్మీ, ప్రదీప్ పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేశారు. కిరణ్ రాయ్ స్వయంగా ఇంటర్వ్యూలు చేసి ఎంపిక చేసినట్లు వీరు తెలిపారు. ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖలు ఉన్నారు.

Tags

Read MoreRead Less
Next Story