Sai Kiran: నటుడికి బెదిరింపులు.. ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు..

Sai Kiran: నటుడికి బెదిరింపులు.. ఆ ఇద్దరు నిర్మాతలపై ఫిర్యాదు..
Sai Kiran: తన దగ్గర అప్పు తీసుకున్న ఇద్దరు నిర్మాతలు తిరిగి డబ్బులు ఇవ్వడం లేదని సాయికిరణ్ పోలీసులకు తెలిపాడు.

Sai Kiran: సినిమాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత కూడా సీరియల్స్‌లో నటించడానికి చాలామంది నటీనటులు ఇష్టపడతారు. అలా పాతికకుపైగా సినిమాల్లో హీరోగా నటించి ప్రస్తుతం సీరియల్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు సాయికిరణ్. ఇప్పటికీ తను నటించిన నువ్వే కావాలి చిత్రం ద్వారానే చాలామంది సాయికిరణ్‌ను గుర్తుపడతారు. తాజాగా ఈ నటుడు ఇద్దరు నిర్మాతలు తనను వేధిస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించాడు.

ప్రస్తుతం మా టీవీలో వచ్చే సీరియల్స్‌లో సాయికిరణ్ బుల్లితెర ప్రేక్షకులకు అలరిస్తున్నాడు. కోయిలమ్మ సీరియల్‌తో బుల్లితెర ఆర్టిస్టుగా మారిన ఆయన.. ప్రస్తుతం తెలుగు మాత్రమే కాదు మలయాళంలో కూడా పలు సీరియల్స్‌లో నటిస్తున్నాడు. అయితే తన దగ్గర అప్పు తీసుకున్న ఇద్దరు నిర్మాతలు తిరిగి డబ్బులు ఇవ్వడం లేదని, అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని సాయికిరణ్ పోలీసులకు తెలిపాడు.

నిర్మాతలు జాన్ బాబు, లివింగ్ స్టన్‌లు తన దగ్గర రూ.10.6 లక్షలు అప్పు తీసుకున్నారని తిరిగి ఇవ్వడం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశాడు సాయికిరణ్. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Tags

Read MoreRead Less
Next Story