Samantha- MEK: హ్యాట్సాఫ్ సమంత.. మరోసారి మనసు గెలుచుకున్నావ్..!

Samantha- MEK: హ్యాట్సాఫ్ సమంత.. మరోసారి మనసు గెలుచుకున్నావ్..!
Samantha- MEK: తాజాగా ఓ యాడ్ షూట్‌లో కూడా పాల్గొంది. ఇక తారక్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సెలబ్రెటీ గెస్ట్‌గా సమంత స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది.

Samantha- MEK:ఇంట్లో వాళ్ల పేరు కంటే సమంత పేరునే ఎక్కువగా కలవరిస్తున్నారు గత పదిరోజులుగా .. విడిపోతున్నాం అని ప్రకటించిన రోజు నుంచి సామ్‌చైలకు సంబంధించిన ఏదో ఒక వార్త నెట్టింట్లో హల్ చేస్తూనే ఉంది. ముందు నుంచి నాగచైతన్య సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు.

కానీ సమంత అభిమానులకు దగ్గరగా ఉంటూ వారితో తన ఆంతరంగిక విషయాలను అప్పుడప్పుడూ షేర్ చేస్తుంటుంది. చైతన్యతో విడిపోయినందుకు సమంతని ఒక్కదాన్నే తప్పుపడుతూ నెటిజన్లు ట్రోల్ చేయడాన్ని జీర్ణించుకోలేకపోతోంది. తప్పంతా తన ఒక్కదాన్నే అయినట్లు ట్రోల్ చేయడం బాధ కలిగిస్తోందని పోస్ట్ పెట్టింది.

విడాకుల విషయం నుంచి బయటకు వచ్చే క్రమంలో సమంత బిజీగా ఉండడానికి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ యాడ్ షూట్‌లో కూడా పాల్గొంది. ఇక తారక్ హోస్ట్ చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షోకి సెలబ్రెటీ గెస్ట్‌గా సమంత స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చింది.

అడిగిన వాటన్నింటికీ టకటకా ఆన్సర్ చేస్తూ రూ.25 లక్షలు ప్రైజ్ మనీ పొందినట్లు తెలుస్తోంది. అయితే తాను గెలుచుకున్న మొత్తాన్ని ఓ ఛారిటీ సంస్థకు ఇస్తున్నట్లు ప్రకటించి సమంత తన ఉదారతను చాటుకుందని సమాచారం.

ఇప్పటికే ప్రత్యూష సంస్థకి ఫౌండర్‌గా ఉన్న సమంత.. ఛారిటీ కోసం చాలా కార్యక్రమాలు చేస్తుంటుంది. ఇప్పుడు కూడా గెలుచుకున్న మొత్తాన్ని ఛారిటీకి ఇవ్వడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు.

కాగా, మజిలీ సినిమాలో లాగా సమంత, చైతన్యలు మరిన్ని సినిమాల్లో కలిసి నటిస్తే చూడాలని ఉందని అభిమానులు ముచ్చటపడుతున్నారు. మరి డైరెక్టర్లు కథ సిద్ధం చేస్తే చైసామ్ కలిసి యాక్ట్ చేస్తారో లేదో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story