కరోనా విలయంపై ప్రత్యేక గీతం ఆలపించిన బాలు.. అదే కరోనాతో..

కరోనా విలయంపై ప్రత్యేక గీతం ఆలపించిన బాలు.. అదే కరోనాతో..
కరోనాను జయించడం... మళ్లీ అనారోగ్యం పాలై కన్నుమూయడం... అంతా కలలా గడచిపోయింది.

ప్రపంచంలో కల్లోలం సృష్టించిన కరోనా విలయంపై ప్రత్యేక గీతం ఆలపించిన బాలు... అదే కరోనాతో ఆస్పత్రి పాలు కావడం... కరోనాను జయించడం... మళ్లీ అనారోగ్యం పాలై కన్నుమూయడం... అంతా కలలా గడచిపోయింది. 50 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన బాలు... సంపూర్ణ ఆరోగ్యంతో బయటకు వస్తారని అభిమానులు ఆశించారు. కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేశారు. కానీ... తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయి... సంగీత ప్రపంచాన్ని విషాదంలో ముంచారు.

Tags

Read MoreRead Less
Next Story