ఎస్పీ బాలు ఆరోగ్యంపై కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల.. అభిమానుల్లో ఆందోళన..

X
By - Nagesh Swarna |24 Sept 2020 6:08 PM IST
అనారోగ్యం నుంచి కోలుకున్న బాలు... మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు మళ్లీ అస్వస్థతకు గురయ్యారు. చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో బాలుకు చికిత్స పొందుతున్నారు. కరోనా లక్షణాలతో ఆగస్టు 5న హాస్పిటల్లో చేరారు. 50 రోజులుగా చికిత్స పొందుతున్న ఎస్పీ బాలు... ఆరోగ్యం నిలకడగా ఉందని ఇటీవల ఆయన కుమారుడు ఎస్పీ చరణ్ ప్రకటించారు. కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. అనారోగ్యం నుంచి కోలుకున్న బాలు... మళ్లీ అస్వస్థతకు గురయ్యారు.
ఎస్పీ బాలు ఆరోగ్యంపై ఎంజీఎం హాస్పిటల్ కాసేపట్లో హెల్త్ బులెటిన్ విడుదల చేయనుంది. వైద్యుల బృందం పర్యవేక్షణలో బాలు చికిత్స పొందుతున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com