SP Charan: హీరోయిన్తో క్లోజ్గా ఎస్పీబీ తనయుడి ఫోటో.. త్వరలో పెళ్లంటూ రూమర్స్..
SP Charan: తెలుగులోనే కాదు అనేక భారతీయ భాషల్లో ఆయన స్వరంతో ప్రేక్షకులను అలరించారు ఎస్ పీ బాలసుబ్రహ్మణ్యం. ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన పాడిన పాటలు మాత్రం ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంటాయి. ప్రస్తుతం ఎస్పీబీ తనయుడు ఎస్పీ చరణ్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానికి ఆయన చేసిన ఇన్స్టాగ్రామ్ పోస్టే కారణం.
ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు చరణ్. దర్శకుడిగా, నిర్మాతగా, సింగర్గా.. ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చరణ్ స్వరం.. తన తండ్రిని గుర్తుచేస్తుంటుందని ప్రేక్షకులు అనుకుంటూ ఉంటారు. అయితే తాజాగా చరణ్.. ఓ హీరోయిన్తో క్లోజ్గా ఫోటో దిగి.. అది తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. కాసేపట్లోనే ఇది వైరల్గా మారింది.
7/జీ బృందావన కాలనీ సినిమా విడుదలయ్యి ఎన్నో సంవత్సరాలు అయినా కూడా ఇప్పటికీ చాలామందికి ఇది ఫేవరెట్. ఆ సినిమాతో హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకున్న సోనియా అగర్వాల్.. ఆ తర్వాత కొంతకాలానికే సినీ పరిశ్రమకు దూరమయిపోయింది. తాజాగా సోనియా అగర్వాల్తో క్లోజ్గా ఫోటో దిగి.. తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు చరణ్.
సోనియా అగర్వాల్తో తాను దిగిన ఫోటోకు 'ఏదో కొత్తగా జరగనుంది' అని క్యాప్షన్ కూడా పెట్టారు. దీంతో వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారా అనే అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా కాసేపట్లోనే ఫోటో వైరల్గా కూడా మారింది. దీంతో ఆ రూమర్స్కు చెక్ పెడుతూ మరో పోస్ట్ చేశారు చరణ్. దానికి ఇండియన్ వెబ్ సిరీస్, ఫిల్మ్ ప్రొడక్షన్ అని హ్యాష్ట్యాగ్స్ పెట్టడంతో పెళ్లి వార్తలకు ఫుల్స్టాప్ పడింది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com