SSMB 28: మహేశ్‌కు విలన్‌గా నందమూరి హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..!

SSMB 28: మహేశ్‌కు విలన్‌గా నందమూరి హీరో.. త్రివిక్రమ్ ప్లాన్ అదిరిందిగా..!
SSMB 28: సర్కారు వారి పాట హిట్ తర్వాత మహేశ్.. త్రివిక్రమ్, రాజమౌళితో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు.

SSMB 28: యాక్టర్‌గా గుర్తింపు తెచ్చుకోవాలంటే హీరోగానే కాదు అప్పుడప్పుడు విలన్‌గా కూడా నటించాలని అనుకుంటున్నారు కొందరు నటులు. అందుకే సినిమాల్లో హీరోయిజం మాత్రమే కాదు విలనిజం చూపించడానికి కూడా రెడీ అయిపోతున్నారు. తాజాగా ఓ నందమూరి హీరో కూడా ఇదే ఫార్ములాను ఫాలో అయిపోతున్నట్టుగా అనిపిస్తోంది. అందుకే మహేశ్‌కు ఢీ కొట్టే విలన్‌గా సిద్ధమవుతున్నాడు.

సర్కారు వారి పాట హిట్ తర్వాత మహేశ్.. త్రివిక్రమ్, రాజమౌళితో సినిమాలు చేయడానికి సిద్ధమవుతున్నాడు. అయితే రాజమౌళితో మూవీ అంటే ఎలాగో చాలా సమయం పడుతుంది కాబట్టి ఈలోపు త్రివిక్రమ్‌తో చేయాల్సిన సినిమాను పూర్తి చేసేద్దామనే ఆలోచనలో ఉన్నాడట మహేశ్. ఇప్పటికే ఈ మూవీ పూజా కార్యక్రమాలు కూడా పూర్తిచేసుకుంది. తాజాగా ఇందులో విలన్ ఎవరో రివీల్ అయ్యింది.

నందమూరి కుటుంబం నుండి హీరోగా పరిచయమయ్యాడు తారక్ రత్న. కానీ తనకు హీరోగా లక్ అంతగా కలిసి రాలేదు. అందుకే కొన్నా్ళ్లు సినిమాలకు దూరంగా ఉన్న తర్వాత విలన్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు. తన విలనిజంకు ప్రేక్షకులు ఫిదా అయినా.. వెంటవెంటనే అవకాశాలు మాత్రం అందుకోలేకపోయాడు తారక్ రత్న. చాలాకాలం తర్వాత మహేశ్, త్రివిక్రమ్ మూవీలో విలన్‌గా కనిపించనున్నాడు తారక్. ఇక ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డే మెరవనుంది.



Tags

Read MoreRead Less
Next Story