Tollywood: సమంత 'శాకుంతలం' ట్రైలర్ అదుర్స్.. వేరే లెవల్

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మైథలాజికల్ డ్రామా 'శాకుంతలం'. భారతీయ ఇతిహాసాల ఆధారంగా వస్తున్న ఈ మూవీలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటిస్తోంది.
ఫిబ్రవరి 17న పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న'శాకుంతలం' మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇక తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. అద్భుతమైన విజువల్స్, అందమైన ప్రకృతితోపాటు సమంత లుక్స్ ఎంతగానో ఆకట్టుకున్నాయని చెప్పవచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ ఈ మూవీకి ప్లస్ అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు.
ప్రేమలో మోసపోయి, దుర్వాస మహర్షి ఆగ్రహానికి గురైన శకుంతల కథ చక్కగా చెప్పే ప్రయత్నం చేశాడు గుణశేఖర్. మొత్తానికి ఈ ట్రైలర్ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ట్రైలర్ లో మోహన్ బాబు, ప్రకాశ్ రాజ్ తదితరులు నటించారు. మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఈ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుందని చెప్పవచ్చు.
దుష్యుంతుని పాత్రలో నటించిన మలయాళ నటుడు దేవ్ మోహన్ ఈ మూవీతో పరిచయమవుతున్నాడు. చివరిలో ట్రైలర్ ఎండ్ లో సింహంపై కనిపించిన అల్లు అర్హ మరో హైలైట్ అని చెప్పాలి. మరి ట్రైలర్ తో మెస్మరైజ్ చేసిన శాకుంతలం, రిలీజ్ తర్వాత ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటుందో చూడాలి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com