Tollywood: మరో ట్విస్ట్‌...

Tollywood: మరో ట్విస్ట్‌...
రమ్యతో ప్రాణహాని ఉంది: రమ్య వల్ల నరకయాతన అనుభవించా..

సీనియర్ యాక్టర్‌ నరేష్ వ్యవహారంలో మరో ట్విస్ట్‌ వెలుగుచూసింది. మాజీ భార్యపై నరేష్‌ సంచలన ఆరోపణలు చేశారు. తన మాజీ భార్య రమ్య రఘుపతి, రోహిత్ శెట్టితో ప్రాణహాని ఉందని కోర్టును ఆశ్రయించారు. తన ఆస్తి కాజేయడానికి రమ్య ప్రయత్నించిందని, అప్పు ఇచ్చిన వారు ఇంటికి వచ్చి తనను వేధించేవారని నరేష్ వెల్లడించారు. ఇప్పుడు తనను చంపేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. ఇందుకోసం సుపారీ గ్యాంగ్‌ను మాట్లాడుకుందని అన్నారు.


2022 ఏప్రిల్‌లో కొంతమంది ఆగంతుకులు తమ ఇంటి ముందు రెక్కీ నిర్వహించారని ఆరోపించారు. మరోవైపు 24 లక్షలు రికవరీ చేయడానికి వచ్చామని మాయమాటలు చెప్పారని ఆయన తెలిపారు. ఈ ఘటనపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేశానని నరేష్ చెప్పాడు. రమ్యకు డబ్బులు ఇవ్వకపోవడంతో పలు రకాలుగా చంపాలని చూసిందని ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్‌ లీడర్ రఘువీరారెడ్డితో ఫోన్ చేపించి బెదిరించిందన్నారు. ఈ భయంతో ఎక్కడికి ఒంటరిగా వెళ్ళటం లేదని నటుడు నరేష్ చెప్పారు. తనకు తెలిసిన పోలీస్ ఆఫీసర్ ద్వారా హ్యాకింగ్ నేర్చుకొని తన ఫోన్‌ను హ్యాక్‌ చేసి పర్సనల్‌ మెసేజ్‌లు చూసేదని ఆరోపించారు. రమ్య వల్ల నరకయాతన అనుభవించానన్న నరేష్ ఆమె వేధింపులు భరించలేకపోతున్నానన్నారు.


మార్చి 3, 2010 లో బెంగుళూరులో రమ్యతో నరేష్‌ వివాహం జరగగా పెళ్లికి కట్నం కూడా తీసుకోలేదని నరేష్‌ తెలిపారు. రమ్యకు అమ్మ విజయ నిర్మల 30 లక్షల బంగారం చేయించిందని నరేష్‌ తెలిపారు. పెళ్లి అయిన కొన్ని నెలల నుంచే తనకు వేధింపులు మొదలయ్యాయన్నారు. తన తల్లితో పాటుగా బెంగళూరులోనే ఉండాలని రమ్య షరతు పెట్టిందన్నారు. రమ్యకు తనకు 2012లో రణ్వీర్ జన్మించాడని నరేష్ చెప్పుకొచ్చారు. తనకు తెలియకుండానే పలు బ్యాంకులు, పలువురి వ్యక్తుల దగ్గర రమ్య డబ్బు తీసుకుందని తన పేరు చెప్పి లక్షల్లో అప్పులు చేసిందన్నారు. అప్పులు తీర్చుకునేందుకు 10 లక్షలు చెల్లించానని కుటుంబ సభ్యుల నుంచి రమ్య మరో 50 లక్షలు తీసుకుందన్నారు. ఇక తనవల్ల కాదన్న నరేష్ తనకు రమ్యతో విడాకులు కావాలని కోర్టును కోరారు.

Tags

Read MoreRead Less
Next Story