Tollywood: ఆహాలోకి 'వేయి శుభములు కలుగు నీకు'

Tollywood: ఆహాలోకి వేయి శుభములు కలుగు నీకు
శివాజీ రాజా కుమారుడు విజయ్‌ రాజా హీరోగా 'వేయి శుభములు కలుగు నీకు'

'వేయి శుభములు కలుగు నీకు' అనే సినిమాతో టాలీవుడ్ ప్రముఖ నటుడు శివాజీ రాజా కుమారుడు విజయ్‌ రాజా హీరోగా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. థియేటర్లో అందరినీ మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేసింది. భవానీ మీడియా సంస్థ ద్వారా ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహాలో ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

లవ్, కామెడీ, హారర్ ఎంటర్టైనర్‌గా వచ్చిన ఈ మూవీలో విజయ్ రాజా చాలా బాగ నటించాడు. ఆద్యంతం ఆసక్తికరంగా సాగే ఈ సినిమాకు థియేటర్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను సైతం 'వేయి శుభములు కలుగు నీకు' ఆకట్టుకుంటోంది. జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకంపై రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాస రావులు సంయుక్తంగా కలసి ఈ సినిమాను నిర్మించారు.

విజయ్ రాజాకు జోడిగా తమన్నా వ్యాస్ నటించారు. మాస్టర్ జయదేవ్‌, శివాజీ రాజా, ఢీ ఫేం ఫాల్గుణి, సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, అపూర్వ, మీనా, అనంత్, షాయాజి షిండే, శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్ అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు.

Tags

Read MoreRead Less
Next Story