Tollywood: ఫిబ్రవరి 3న 'రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం'

Tollywood: ఫిబ్రవరి 3న రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం
నూతన నటీనటులతో తెరకెక్కిన చిత్రం

వారధి క్రియేషన్స్ ప్రై.లి. బ్యానర్‌పై జైదీప్ విష్ణు దర్శకత్వంలో ప్రవీణ్‌ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయెత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతోంది "రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం". ఈ సినిమాకు సంతోష్‌ మురారికర్ కథ అందించడమే కాకుండా కో డైరెక్టర్‌గానూ పని చేశారు. అయితే ఆదివారం ఈ చిత్ర బృందం ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. అన్నిపనులు పూర్తిచేసుకున్న "రెబెల్స్ ఆఫ్ తుపాకులగూడెం" ఫిబ్రవరీ 3వ తేదీన విడుదల కానున్నట్లు పేర్కొంది చిత్ర బృందం. ఈ వేడుకలో మెలోడి బ్రహ్మ మణిశర్మ పాల్గొన్నారు. ఆయన ఈ సినిమాలోని పాటలకు సంగీతం అందించారు.

డైరెక్టర్ జైదీప్ విష్ణు మాట్లాడుతూ.. "మా ఊరోడు సినిమా తీస్తున్నాడని, మాకు ఊరు ఊరంతా సాయం చేసింది. తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మాకు ఎంతో సాయం చేసింది. ఈ సినిమాకు మ్యూజిక్ విషయంలో ఇబ్బంది పడ్డాం. మణిశర్మ గారి వద్దకు వెళ్లాక ఆ సమస్య తీరిపోయింది. నాలుగు పాటలు నాలుగు రోజుల్లోనే ఇచ్చారు. లిరిక్స్ ఇచ్చిన వెంటనే పాటలు వచ్చేశాయి. కాసర్ల శ్యామ్‌ లేకపోతే మాకు మణిశర్మ దొరికేవారు కాదని" అన్నారు.

మెలోడి బ్రహ్మ మణిశర్మ మాట్లాడుతూ.. 'ఈ సినిమా అంతా అయిపోయిన తరువాత నాకు ఒక విషయం అర్థమైంది. దర్శకుడు కనిపించినంత సాఫ్ట్ ఏం కాదు. మేం అంతా కలిసి కొత్తగా ట్రై చేశాం. ఆడియెన్స్ సినిమాను చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story