Tollywood: హారర్ జర్నీ కేర్ ఆఫ్ 'S5'

Tollywood: హారర్ జర్నీ కేర్ ఆఫ్  S5
కొత్త కాన్సెప్ట్ తో దూసుకువస్తోన్న 'S5'; స్టార్ క్యాస్ట్ దగ్గర నుంచి అన్నీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్సే..

Tollywood: కొత్తదనానికి పెద్ద పీట వేస్తే చాలు స్టార్ క్యాస్ట్ తో సంబంధం లేకుండా ఎలాంటి సినిమానైనా ఆదరిస్తామని తెలుగు ప్రేక్షకులు చెప్పకనే చెప్పేశారు. దీంతో వారి టేస్ట్ కు తగ్గట్లుగానే యంగ్ డైరెక్టర్స్ కొత్త కథలకు పెద్ద పీట వేస్తున్నారు. అందులో భాగంగా వస్తోందే S5 చిత్రం. నందమూరి తారకరత్న హీరోగా నటిస్తున్న ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. దీంతో ట్రైలర్ విడుదలైన దగ్గర నుంచి ఈ సినిమా టాక్ ఆఫ్ ది టౌన్ అయింది.



ప్రిన్స్, సునీల్, అలీ, సాయి కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి భరత్ కోమలపాటి దర్శకత్వం వహించగా, శౌరీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై ఆదూరి ప్రతాప్ రెడ్డి నిర్మించారు. ఇక ఈ మూవీ టైటిల్ 'యస్ 5'కాగా, నో ఎగ్జిట్ అనే ట్యాగ్ లైన్ తో ఆసక్తిని రేకెత్తిస్తోంది.


హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 30న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ దక్కింది. ఓ ట్రయిన్ లో ఎస్5 బోగీలో జరిగిన కథతో ఈ మూవీ స్టార్ట్ అవ్వడం.. ట్రైన్ లో చూపించిన సన్నివేశాలు ఆడియన్స్ లో మరింత ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి.


ఇక సాయి కుమార్ డైలాగ్స్ ఈ మూవీకి హైలైట్ అవుతాయని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేసింది. ఒక ట్రైన్ బోగిలో జరిగిన హిలేరియస్ హారర్ జర్నీ నే ఈ స్టోరీ అని చెప్పవచ్చు. ఇప్పటివరకు ఎవ్వరూ తీయని కాన్సెప్ట్ కు కొత్త టెక్నాలజీ యాడ్ చేసి ఈ సినిమాను తెరకెక్కించారని అర్ధమవుతోంది. ఇక ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందించగా, గరుడ వేగ అంజి సినిమాటోగ్రఫీ బాధ్యతలు తీసుకున్నారు. మరి హరర్ కాన్సెప్ట్ తో వస్తున్న ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story