#SSMB 28 : త్రివిక్రమ్ మహేశ్ కాంబినేషన్‌లో 3వ సారి.. సమ్మర్ 2023లో రిలీజ్

#SSMB 28 : త్రివిక్రమ్ మహేశ్ కాంబినేషన్‌లో 3వ సారి.. సమ్మర్ 2023లో రిలీజ్
#SSMB 28 : త్రివిక్రమ్ మహేశ్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మూవీ.

#SSMB 28: మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు డబుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూజ్. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, సూపర్ స్టార్ మహేశ్ ‌బాబు కాంబినేషన్‌లో రానున్న చిత్రానికి సంబంఛించి మేకర్స్ అఫిషియల్‌గా అనౌన్స్‌మెంట్ చేశారు. #SSMB28 పేరుతో పోస్టర్‌ను చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో విడుదల చేసింది. ఈ మూవీ మహేశ్‌ బాబు తన కెరీర్‌లో 28వ చిత్రం కానుంది. "అతడు", "ఖలేజా" తరువాత మళ్లీ గురూజీ, ప్రిన్స్ కలిసి పనిచేయనున్నారు.

పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించనుంది. హారిక హాసిని బ్యానర్‌పై ఎస్ రాధాకృష్ణ ఈ మూవీని తెరకెక్కించనున్నారు. తమన్ సంగీతాన్ని సమకూర్చనుండగా నవీన్ నూలి ఎడిటర్‌గా పి.ఎస్ వినోద్ కెమెరామెన్‌గా వర్క్ చేయనున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే స్టార్ట్ అయింది. వచ్చే నెల ఆగస్టులో షూటింగ్ మొదలు కానుండగా 2023 సమ్మర్‌లో బిగ్ స్క్రీన్స్‌పై విడుదల కానుంది.

Tags

Next Story