Kemune: 3,400 ఏళ్లనాటి పురాతన నగరం.. ఇన్నాళ్లకు బయటపడింది..
Kemune: ఇరాక్ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఓ భారీ జలాశయం కరువు వల్ల ఎండిపోయింది.

Kemune: కరువుతో నిత్యం అలమటించిపోయే దేశాల్లో ఇరాక్ ఒకటి. అలాంటి ఇరాక్లో ఇటీవల ఓ జలాశయం ఎండిపోయింది. కానీ అది ఎండిపోవడం వల్లే ఓ అద్భుతం బయటపడింది. ఇంతకాలంగా ఆ జలాశయం కింద ఓ నగరం దాగి ఉందన్న విషయం.. అది ఎండిపోయిన తర్వాతే తెలిసింది. అందుకే వెంటనే కుర్దిష్, జర్మనీ ఫ్రీబర్గ్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు దీనిని పరీక్షించి మరిన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు.
ఇరాక్ కెమునేలోని కుర్దిస్థాన్ ప్రాంతంలో ఓ భారీ జలాశయం కరువు వల్ల ఎండిపోయింది. దీంతో 3,400 ఏళ్లనాటి పురాతన నగరం బయటపడింది. ఈ నగరం దాదాపు క్రీస్తూ పూర్వం 1550 నాటిది అని అంచనా వేస్తున్నారు పూరావస్తు శాస్త్రవేత్తలు. అంతే కాకుండా మిట్టని సామ్రాజ్య పాలన సమయంలో ఈ నగరం ప్రధాన కేంద్రంగా ఉండి ఉండవచ్చని వారు భావిస్తున్నారు.
ఇక కరువు వల్ల ఎండిపోయిన జలాశయం వల్ల ఈ నగరం బయటపడింది. అయితే మళ్లీ ఆ జలాశయంలో మెల్లగా నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. దీంతో ఆ నగరం దెబ్బతినకూడదని ప్లాస్టిక్ షీట్లతో దీన్ని మొత్తం కప్పేశారు. మట్టి గోడలు, శిథిలాలు చాలా పురాతన కాలం నాటివి కాబట్టి నీటి వల్ల సులభంగా ధ్వంసం అయ్యే అవకాశం ఉందని వారు ఈ పని చేసినట్టుగా శాస్త్రవేత్తలు తెలిపారు.
RELATED STORIES
Naga Chaitanya: గర్ల్ఫ్రెండ్తో కారులో చైతూ రొమాన్స్.. ఇంతలో...
14 Aug 2022 4:16 PM GMTAnasuya Bharadwaj: అవి నచ్చకే షో వదిలేశాను: అనసూయ భరద్వాజ్
14 Aug 2022 12:15 PM GMTVijay Devarakonda: విజయ్ దేవరకొండ గర్ల్ ఫ్రెండ్ నటి కాదు..! ఆ మాటలకు...
14 Aug 2022 11:30 AM GMTVijayashanthi: 'టాలీవుడ్ ప్రముఖ హీరోలు ఎంత ప్రమోట్ చేసినా లాల్ సింగ్...
14 Aug 2022 10:50 AM GMTNTR: 'కొమురం భీం' పాత్రకు ఆస్కార్.. హాలీవుడ్లో కథనం..
14 Aug 2022 10:10 AM GMTDJ Tillu 2: 'డీజే టిల్లు' సీక్వెల్.. నేహా శెట్టి ప్లేస్లో మలయాళ...
13 Aug 2022 4:23 PM GMT