Delhi: పిల్లలా రాక్షసులా!? 8ఏళ్ల బాలుడి మర్మాంగానికి తాడు బిగించి...

Delhi
Delhi: పిల్లలా రాక్షసులా!? 8ఏళ్ల బాలుడి మర్మాంగానికి తాడు బిగించి...
చిన్నారుల్లో పెరుగుతున్న కర్కశత్వం; ఢిల్లీలో దారుణం; తోటి విద్యార్థి మర్మాంగానికి నైలాన్ తాడు..

Delhi: పిల్లలా రాక్షసులా!? 8ఏళ్ల బాలుడి మర్మాంగానికి తాడు బిగించిన తోటి విద్యార్థులు


వీడియో గేమ్ ల ప్రభావమో, సోషల్ మీడియా వల్ల కలుగుతున్న నష్టమో... చిన్నారుల్లో విపరీత ధోరణులను ప్రేరేపించడానికి ఒకటికి మించిన మరొకటి సాధనాలు వస్తూనే ఉన్నాయి. చక్కగా బడికి పోయి చీకూచింతా లేకుండా ఆడుకోవాల్సిన వయసులో కొందరు చిన్నారులు అతి క్రూరమైన చర్యకు పాల్పడిన సంఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. తోటి విద్యార్థి మర్మాంగానికి నైలాన్ తాడు బిగించి రాక్షసానందం పొందిన వారి కోసం పోలీసుల వేట ప్రారంభమైంది.


న్యూ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని కిడ్వాయ్ నగర్ ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అటల్ ఆదర్శ్ స్కూల్ లో చదువుకుంటోన్న విద్యార్ధి స్నానం చేస్తుండగా అతడి మర్మాంగానికి నైలాన్ తాడు కట్టి ఉండటం చూసిన తల్లితండ్రులు హుతాశులయ్యారు. హుటాహుటిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల సంరక్షణల ో ఉన్న చిన్నారి క్రమంగా కోలుకుంటున్నట్లు తెలుస్తోంది.


ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు తోటి విద్యార్ధులే చిన్నారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు గుర్తించారు. మొత్తం 8 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అయితే బాలుడు ప్రస్తుతం వారిని గుర్తించే పరిస్థితిలో లేకపోవడంతో పోలీసులే స్కూల్ కు వెళ్లి వారిని కనిపెట్టే బాధ్యతను తీసుకున్నారు.



Tags

Read MoreRead Less
Next Story