PUBG Love Story: సీమా పాకిస్థాన్ ఏజెంటా..!? విచారిస్తున్న పోలీసులు
![PUBG Love Story: సీమా పాకిస్థాన్ ఏజెంటా..!? విచారిస్తున్న పోలీసులు PUBG Love Story: సీమా పాకిస్థాన్ ఏజెంటా..!? విచారిస్తున్న పోలీసులు](https://www.tv5news.in/h-upload/2023/07/18/1020548-10.webp)
పబ్జీ ఆడుతూ ప్రేమలో పడి భారత్లోకి అక్రమంగా ప్రవేశించిన( illegal enter) పాకిస్థానీ మహిళ సీమా గులాం హైదర్(Pakistan's Seema Haider)- సచిన్ ప్రేమ కథ కొత్త మలుపు తిరిగింది. ఉత్తర్ప్రదేశ్ యువకుడితో ప్రేమలో పడి.. నలుగురు పిల్లలతో కలిసి భారత్లోనే నివాసం ఉంటున్న సీమా హైదర్ను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. సీమా పాక్ గూఢచారి అనే ఆరోపణలు వస్తుండడంతో ఆమెను పోలీసులు విచారించారు. యూపీ ఏటీఎస్ బృందం సీమా హైదర్ను అదుపులోకి తీసుకుని రహస్య ప్రదేశంలో సుదీర్ఘంగా విచారించింది. సీమా హైదర్ భారత్లోకి వచ్చినప్పటి నుంచి ఏటీఎస్ నిఘా( ATS scanner)లోనే ఉన్నారు. ఆమె తన ప్రేమికుడు సచిన్ను కలవడానికి నేపాల్ మీదుగా భారత్లోకి వచ్చారు. ఏటీఎస్ బృందం సిమా వాట్సాప్ చాట్ సహా అన్ని ఆధారాల ఆధారాలను పరిశీలిస్తున్నారు. వారిద్దరి పరిచయం ఎలా జరిగింది అనే విచారణ(investigation) జరుపుతున్నారు.
దీంతో పాటు సీమ ఐడీ కార్డులను హైకమిషన్కు పంపించగా.. సీమ(Seema Haider) మామ పాకిస్థాన్ ఆర్మీలో సుబేదార్ అని, సీమ సోదరుడు పాకిస్తాన్ సైనికుడని తెలిసింది. భారత భద్రతా ఏజెన్సీ ఇప్పుడు సరిహద్దులపై ఫోకస్ పెట్టింది. లవ్ స్టోరీ నుంచి ఇండియాకి వచ్చే వరకు అన్ని కోణాల్లోనూ ఎంక్వైరీ జరుగుతోంది. సీమా పాకిస్థాన్ పౌరురాలేనని.. ఆమె రాకలో చాలా సమస్యలు ఉన్నాయని యూపీ సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. ఇలవంటి పరిస్థితిలో, ఆమెను విచారించడం అవసరం.. కాబట్టి దేశ భద్రతకు సంబంధించిన అన్ని ఏజెన్సీలు విచారిస్తున్నాయని తెలిపారు.
సీమా గులాం హైదర్తో పాటు ఆమె ప్రియుడు సచిన్ మీనా(boyfriend Sachin), అతడి తండ్రినీ ఉత్తర్ప్రదేశ్కు చెందిన తీవ్రవాద నిరోధక దళం పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు తన భర్త హిందువని, తానూ ఇప్పుడు హిందువునేనని సీమా తెలిపారు. తాను భారతీయురాలిగానే భావిస్తున్నానని చెప్పారు.
తన భార్య సీమా హైదర్ను తిరిగి పాకిస్థాన్కు పంపించాలని, ఆమెను ఇప్పటికీ ప్రేమిస్తున్నానని భర్త గులాం హైదర్ పేర్కొన్నాడు. తిరిగి రావాలని తన భార్యకు సౌదీ అరేబియాలో ఉంటున్న అతడు విజ్ఞప్తి చేశాడు.
సీమాకు, భారత్కు చెందిన 22 ఏళ్ల సచిన్కు 2019లో పబ్జీ(PUBG) ఆడుతుండగా పరిచయమైంది. ఆ తర్వాత వారు ప్రేమలో పడ్డారు. దీంతో ఏడేళ్లలోపున్న తన నలుగురు పిల్లలను తీసుకుని దుబాయ్ మీదుగా నేపాల్.. అక్కడి నుంచి భారత్లోకి సీమా వచ్చింది. అప్పటి నుంచి వారిద్దరూ గ్రేటర్ నొయిడాలోని ఒక అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్నారు. సచిన్ కిరాణా దుకాణం నడుపుతున్నాడు. అయితే ఈ నెల 4వ తేదీన పోలీసులకు సమాచారం అందడంతో సచిన్, సీమాలను అరెస్టు చేశారు. ఇటీవల వారిద్దరికీ బెయిలు లభించింది. ఈ నేపథ్యంలో పోలీసులు వారిని ప్రశ్నిస్తున్నారు.
Tags
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com